ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు రిలీజ్ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’. 2009లో వచ్చిన ‘అవతార్’కి సీక్వెల్ గా దాదాపు పదమూడేళ్ల తర్వాత ‘అవతార్ 2’ రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. అవతార్ సినిమాతో అందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. అద్భుతమైన విజువలైజేషన్ తో.. అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో అవతార్ 2 మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా క్రిస్మస్ ఫెస్టివల్ కి ముందే డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుమారు 160 భాషల్లో అవతార్ 2.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటం విశేషం.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ సీక్వెల్ అంటేనే ఊహకందని రేంజిలో విజువల్స్.. ఆ పండోరా ప్రపంచం.. అక్కడి మనుషులు.. ఎమోషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. ముఖ్యంగా విజువల్స్ ని ఎంజాయ్ చేయడానికే రెండు కళ్ళు సరిపోవని భావిస్తున్నారు ప్రేక్షకులు. అయితే.. అవతార్ 2 సినిమా బిజినెస్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అవతార్ 2 థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా పట్ల ఉన్న భారీ హైప్ ని దృష్టిలో పెట్టుకొని థియేట్రికల్ రైట్స్ కొనే ఆలోచనలో ఉన్నారట.
తెలుగు రాష్ట్రాలలో అవతార్ 2 మూవీకి ఊహించని స్థాయిలో భారీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలలో టాక్ నడుస్తుంది. అవతార్ 2 మూవీ థియేట్రికల్ రైట్స్ కేవలం తెలుగు రాష్ట్రాలలోనే రూ. 100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు సమాచారం. అందుకే ఒక్కరే కాకుండా పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి హక్కులను కొనే ఆలోచనలో ఉన్నారని టాక్. ఎందుకంటే.. అవతార్ 2 మూవీకి ఎక్కడైనా ఓపెనింగ్ కలెక్షన్స్ ఊహించని రేంజిలో భారీగా ఉంటాయి. సో.. రికవరీ కూడా కొద్దిరోజుల్లోనే అవుతుందని భావించి రూ. 100 కోట్లవరకు రైట్స్ కొంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తమిళనాడు, కేరళ కలిపి రూ. 50 కోట్లు బిజినెస్ జరిగిందని అంటున్నారు. అయితే.. ఈసారి అవతార్ 2 ‘ది వే ఆఫ్ వాటర్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది. చూడాలి మరి అవతార్ 2.. ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో!