ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోదాలో ఉన్నవారంతా మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ స్టార్స్ మాత్రమే కాకుండా టీవీ యాంకర్స్ కూడా మాల్దీవ్స్ కి సరదాగా వెళ్లి వస్తున్నారు. రీసెంట్ గా స్టార్ యాంకర్ రష్మీ కూడా మాల్దీవ్స్ టూర్ కి వెళ్లి ఫోటోలు, వీడియోలు పెట్టి ఫ్యాన్స్ ని ఊరించింది. పైగా ఎప్పుడూ అభిమానులు చూడని రేంజ్ లో అందాలను షో చేసింది. అయితే.. ముందు నుండే గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ.. హాట్ షో చేయడం అనేది కొత్త కాదు. కానీ.. మాల్దీవ్స్ కి వెళ్ళాక బీచ్ లో, బోట్ పై.. రిసార్ట్ లో రష్మీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మాల్దీవ్స్ లో మరింత అందంగా మురిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. కొద్దిరోజులుగా తన మాల్దీవ్ టూర్ కి సంబంధించి కొత్త కొత్త ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న రష్మీ.. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసింది. ఈసారి రిసార్ట్ ముందు బీచ్ లోని ఇసుకలో వైట్ షర్ట్.. మినీ నిక్కర్ ధరించి థైస్ షో చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రష్మీ థైస్ షో చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే.. వీడియోలో రష్మీ ఒంటరిగా కనిపించేసరికి.. పార్టనర్ కోసం వెయిట్ చేస్తుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా.. సోషల్ మీడియాలో 46 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రష్మీ.. రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో అలరించింది.
ఇదిలా ఉండగా.. యాంకర్ రష్మీ ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతోంది. కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ చేస్తూ మెల్లగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు పరిచయమై.. కొంతకాలంలోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే.. యాంకరింగ్ మాత్రమే కాకుండా అడపాదడపా సినిమాలలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. కానీ.. సరైన హిట్స్ లేక యాంకరింగ్ లోనే కంటిన్యూ అవుతోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే రష్మీ.. ఇలా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సోలో లైఫ్ లీడ్ చేస్తోంది. చూడాలి మరి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో!