సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా అందులోనే పోస్ట్ చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ విషయమైనా టీవీ న్యూస్, పేపర్ న్యూస్ తెలుసుకునేవారు అభిమానులు. కానీ, ఇప్పుడా రోజులు పోయాయి. ఏ విషయమైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది మంచి అయినా, చెడైనా ఏదైనా వైరల్ చేసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ స్టార్ హీరోయిన్.. తనకు బిడ్డ పుట్టేవరకు ప్రెగ్నెన్సీ వార్తను బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అంతెందుకు ఆ హీరోయిన్ పెళ్లి కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుంది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా? ఆమె ఎవరో కాదు.. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రియ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు స్టార్స్ అందరి సరసన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లు వెలిగింది. ఇక పెళ్లి తర్వాత నుండి హీరోయిన్ గా కాకుండా సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తోంది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో పాటు రీసెంట్ గా దృశ్యం-2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు, మలయాళం భాషలలో దృశ్యం మూవీ ఓటిటి రిలీజ్ అయ్యింది. కానీ, అదే మూవీ హిందీలో రీమేక్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేశారు. దీంతో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక దృశ్యం 2 సూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్ మీట్ లో పాల్గొన్న శ్రియ.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు దాచాల్సి వచ్చిందో కారణం చెప్పింది. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. “నా కూతురు రాధా కడుపులో ఉన్న మధుర క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆస్వాదించాలని అనుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా లావు అవుతారు. కానీ, జనాలు ఈ విషయాన్నీ హీరోయిన్స్ విషయంలో నార్మల్ గా చూడరు. ఈ విషయం మీడియాకి, ఫ్యాన్స్ కి తెలిస్తే నా బాడీ షేప్ పై, నా బిడ్డపై ఫోకస్ పెడతారు. అలాంటి ఒత్తిడి వద్దు అనుకునే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను.” అని తెలిపింది. ప్రస్తుతం శ్రియ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి శ్రియ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.