సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటీనటులు ఏళ్ళు గడుస్తున్నకొద్దీ కనుమరుగు అవుతున్నారు. ఒకప్పుడు ఎన్నో వందల సినిమాలలో నటించిన హేమాహేమీలు.. కొంతమంది లైఫ్ లో ఆర్థికంగా అన్నివిధాలా సెటిల్ అవ్వగా.. మరికొందరు సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకొని అద్దె ఇళ్లలో జీవనాన్ని సాగిస్తున్నారు. కెరీర్ పరంగా రాజభోగాలు అనుభవించిన నటీనటులు.. వయసు మీదపడేసరికి ఎలాంటి ఆదరణ లేకుండా ఒంటరిగా బ్రతకడం అనేది ప్రేక్షకులను, ఫ్యాన్స్ ని బాధించే విషయం. రీసెంట్ గా పావలా శ్యామల, నటి జయకుమారిలతో కొంతమంది ఇప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో వార్తల్లో చూశాం.
ఈ విధంగా మరో సీనియర్ నటి వెలుగులోకి వచ్చారు. కెరీర్ లో వందల సినిమాలలో నటించిన ఆ నటి.. ఒకానొక దశలో నిర్మాతగా కూడా విజయవంతమైన సినిమాలు చేసి.. ఫైనాన్సియర్ గా కూడా రాణించారని తెలుస్తోంది. ఆ నటి ఎవరో కాదు.. జీ. ఝాన్సీ. ఈమె తెలుగులో 70, 80లలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు ఎందరో మహానటుల సినిమాలలో కీలకపాత్రలు పోషించారు. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలు చూసిన ఝాన్సీ.. సంపాదించిన ఆస్తులన్నీ సినిమాలలోనే పోగొట్టుకున్నారట. తాజాగా సుమన్ టీవీతో చేసిన ఇంటర్వ్యూలో ఝాన్సీ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని.. పెద్దాయన బెంగుళూరులో, చిన్నాయన విజయవాడలో స్థిరపడినట్లు తెలిపారు.
ప్రస్తుతం నటి ఝాన్సీ వయసు 75కి పైనే. కాగా.. ఈ వయసులో హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవనాన్ని సాగిస్తున్నారు. ఒకప్పుడు చెన్నైలో ఉండేవాళ్లమని, అక్కడినుండి హైదరాబాద్ కి వచ్చాక సినిమాలలో నష్టపోయి ఆస్తులన్నీ అమ్మేసినట్లు ఆమె చెప్పారు. అంతేగాక.. ప్రస్తుతం నెలనెలా ఇంటి అద్దెతో పాటు ఇల్లు గడవడం కూడా ఇబ్బంది అవుతుందని.. ఆర్థికంగా పరిస్థితి దయనీయంగా ఉందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు నటి ఝాన్సీ. 30 ఏళ్ళ క్రితమే తన భర్తను కోల్పోయినట్లు తెలిపారు. దీంతో ఝాన్సీ కష్టాలు విన్న సుమన్ టీవీ యాంకర్ ఆమెకు ఆర్థికంగా చివరివరకు హెల్ప్ చేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నటి ఝాన్సీ లైఫ్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.