సుదూర ప్రయాణాలు చేసేవారు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తక్కువ ఛార్జీ ఉండటం ఒక కారణమైతే.. అలసట లేకుండా సురక్షిత ప్రయాణం చేయొచ్చన్నది.. మరో కారణం. అలాంటి సమయాల్లో ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తుంటారు. అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అందులోనూ ముఖ్యంగా.. మనం రిజర్వ్ చేసుకున్న సీటులో వేరొకరు కూర్చోవడం.. లేవమంటే లేవరు. పైగా వాదనలకు దిగుతుంటారు. సీట్ షేర్ చేసుకుందాం అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.
రైళ్లలో సీట్లను ఆక్రమించుకోవడం అనే రచ్చ మన దేశంలో కొత్తేం కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. టికెట్ రిజర్వ్ చేసుకోని కొంతమంది ప్రయాణీకులు.. సెకండ్ క్లాస్, స్లీపర్, AC క్లాస్ వరకు అన్నీ తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ కూర్చుంటారు. అలాంటి సమయాల్లో ప్రయాణికుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరుగకుండా, ఎవరూ బెదిరింపులకు పాల్పడకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చింది. ఎవరైనా మీ రిజర్వ్ సీటులో కూర్చుంటే.. వెంటనే టీటీఈ కి కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే ‘రైల్వే మదద్’లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదు ఎలా చేయాలి?
139 హెల్ప్ లైన్ నెంబర్ కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.
రైలు ప్రయాణంలో ఎవరైనా మీ రిజర్వ్డ్ సీటును ఆక్రమించినట్లయితే.. మొదట ఆ విషయాన్ని మొదట రైలులోని టీటీఈకి తెలియజేయాలి. వాదోపవాదనలతో గొడవ పెద్దదైతే.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలి. ఒకవేళ ఆన్లైన్లో కంప్లంట్ ఇవ్వలేకపోతే.. రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.