భారతీయ రైల్వే.. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు రాయితీలపై, ఇతర మార్పులపై తాజా సమాచారాన్ని అందిస్తుంది. ప్రయాణికులకు సర్వీసులు అందించేందుకు విస్తృత కృషి చేస్తుంది. లేటెస్ట్గా సీనియర్ సిటీజన్స్ కు గుడ్న్యూస్ చెబుతుంది.
దూర ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రవాణా సాధనాలలో రైలు అతి ముఖ్యమైనది. భారతీయ రైల్వే ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తుంది. తాజాగా రైల్వేశాఖ సీనియర్ సిటీజన్స్కి శుభవార్త అందించింది. ఒకవేళ మీరుకూడా సీనియర్ సిటీజన్ అయిఉండి, రైలు ప్రయాణం చేస్తే అనేక సౌకర్యాలను పొందే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
భారతీయ రైల్వేశాఖ ద్వారా ప్రతినిత్యం 10 వేలకంటె ఎక్కువ రైళ్లు నడుపుతుంది. రైళ్లలో అనేక సౌకర్యాలు పొందే అవకాశం ఉందని పార్లమెంట్లో రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారంపై పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. ట్రైన్ లో ధృవీకరించబడిన లోయర్ బెర్త్ ల సౌకర్యాన్ని సీనియర్ సిటీజన్స్ పొందుతున్నారని తెలిపారు. దీనికి ప్రత్యేక నిబంధన ఉంది. 45 ఏళ్లు నిండిన మహిళా ప్యాసెంజర్స్ లోయర్ బెర్త్ కోసం సెలెక్ట్ చేసుకోనక్కర లేదని.. రైల్వే నుంచి ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ లభిస్తుందని అన్నారు.
స్లీపర్ కేటగిరీలో సీనియర్ సిటీజన్లకు, 45 ఏళ్లు నిండిన మహిళలకు 6 లోయర్ బెర్త్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఏసీ కోచ్లో కూడా ఒక్కో కోచ్లో నాలుగు నుండి ఐదు లోయర్ బెర్త్లు, 2 ఏసీలో ఒక్కో కోచ్లో మూడు నుండి నాలుగు లోయర్ బెర్తులు కేటాయించారు. ఈ సదుపాయాన్ని గర్భిణీ స్త్రీలు కూడా పొందుతారు.
ట్రైన్ టికెట్ రాయితీ కూడా సీనియర్ సిటీజన్లు, దివ్యాంగులు, సిస్టమ్లోని పై బెర్త్లు పొందిన మహిళలకు, ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే ఆన్బోర్డ్ ద్వారా ఇచ్చేందుకు నిబంధన విధించారు. రైల్వేశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతంలో 60 సంవత్సరాలు లేదా అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు ఛార్జీలలో 40% తగ్గింపు ఇచ్చేది. మహిళలకు 58 సంవత్సరాల వయస్సు నుండి 50% మినహాయింపు పొందారు. మెయిల్, ఎక్స్ప్రెస్, రాజధానితో సహా అన్ని రైళ్లలో ఈ మినహాయింపు పొందవచ్చని రైల్వే మంత్రి వెల్లడించారు.
.