పదోతరగతి పాసయ్యారా? ఒక 20 వేల నుంచి 70 వేల వరకూ జీతం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే. సెంట్రల్ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సంస్థ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో పోస్టులు పడ్డాయి. అణుశక్తి ప్లాంట్లు, నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు,, స్ స్టేషన్లు, కరెన్సీ నోట్ ప్రెస్ లు, స్టీల్ ప్లాంటులు మొదలైన వాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటి భద్రత కోసం సీఐఎస్ఎఫ్ పని చేస్తుంది. అలాంటి సంస్థలో పని చేయాలన్న ఆసక్తి ఉంటే గనుక మీకు ఈ ఉద్యోగం వంద శాతం సూటవుతుంది. స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.