కోహ్లీ ఆ గొడవని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. గంభీర్ ని మళ్లీ కెలికాడు. ఆ ఒక్క పనిచేసి ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. గంభీర్ తో ఈ మధ్య గ్రౌండ్ లో జరిగిన గొడవని అస్సలు మర్చిపోలేకపోతున్నాడు! ఎందుకంటే ఆ రోజు ఏదో ఆవేశంలో జరిగిపోయింది. బీసీసీఐ ఇద్దరికీ ఫైన్ వేసింది. దీంతో సైలెంట్ అయిపోయారని అందరూ అనుకున్నారు. ఆ గొడవ జరిగి కొన్నిరోజులైపోయేసరికి నెటిజన్స్ కూడా కాస్త మర్చిపోయారు. అలాంటిది కోహ్లీ మళ్లీ దాన్ని గుర్తుచేసేలా ఓ పనిచేశాడు. చెప్పాలంటే గంభీర్ ని మళ్లీ రెచ్చగొట్టినట్లు చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే కోహ్లీ-గంభీర్.. టీమిండియా తరఫున ఆడి చాలా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులైన వీళ్లు.. ఆ తర్వాత కొంతకాలానికి శత్రువులుగా మారిపోయారు. 2013 ఐపీఎల్ లో ఓ మ్యాచ్ సందర్భంగా ఈ విషయం బయటపడింది. అప్పటినుంచి వీలుదొరికినప్పుడల్లా గంభీర్, కోహ్లీని విమర్శిస్తూనే వచ్చాడు. కోహ్లీ మాత్రం కాస్త కూల్ గానే ఉంటూ వచ్చాడు. కానీ రీసెంట్ గా ఆర్సీబీ-లక్నో మ్యాచ్ సందర్భంగా పెద్ద గొడవ జరిగింది. మ్యాచ్ లో బెంగళూరు గెలిచేసరికి గంభీర్ తట్టుకోలేకపోయాడు. కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్యలో దూరి గొడవని కాస్త పెద్దది చేశాడు.
ఆ రోజు కోహ్లీ-గంభీర్.. ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. సరే అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. అక్కడితో అది అయిపోయిందనుకున్నారు. కానీ తాజాగా ఆదివారం మధ్యాహ్నం గుజరాత్-లక్నో మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ గెలిచింది. దీనికి కోహ్లీకి ఏమాత్రం సంబంధం లేదు. అయినాసరే కావాలని గంభీర్ ని రెచ్చగొట్టాలనో ఏమో గానీ గుజరాత్ క్రికెటర్లు సాహ, రషీద్ ఖాన్ గురించి ఇన్ స్టాలో స్టోరీలు పెట్టాడు. ఇవి చూసిన నెటిజన్స్.. గంభీర్ ని మళ్లీ కెలకడానికే కోహ్లీ ఇలా చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే వీళ్లిద్దరి గొడవ గురించి మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.