ఐపీఎల్ లో కోహ్లీతో గొడవ గంభీర్ పెద్ద తలనొప్పిగా మారింది. తద్వారా ఊహించని షాక్ ఈ మాజీ ఓపెనర్ కి తగలనుందని సమాచారం. కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ ని మెంటార్ పదవి నుంచి తొలగించాలని వార్తలు వస్తున్నాయి.
భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మీద టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. డబ్బుల కోసం దిగజారే వీళ్లేనా మన రోల్ మోడల్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ క్రికెటర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించాడు గౌతీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!
కోహ్లీతో గొడవని ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకని లక్నో అనుకున్నట్లు ఉంది. అందుకే ఫైనల్ గా కాంప్రమైజ్ కి వచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ ట్వీట్ చేసింది.
భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.
ఆటల్లో వివాదాలు జరుగుతుండటం కామనే. కానీ గేమ్ కంటే కాంట్రవర్సీలు హైలైట్ అవడం ఎంతమాత్రం మంచిది కాదు. వివాదాలకు ఎండ్ కార్డ్ పడి.. ఆటపై ఫోకస్ పెంచాలి. కానీ ఈ వివాదాలను ఆటగాళ్లు లైట్ తీసుకున్నా.. వారి ఫ్యాన్స్ మాత్రం అస్సలు వదలమని అంటున్నారు.
విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవను ఆధారంగా చేసుకొని, ఓ అనామక కోడర్ వీరిద్దరిపై వీడియో గేమ్ను రూపొందించాడు. ఈ గేమ్లో కోహ్లీ ఓటమిపాలవ్వడం గమనార్హం.