ఐపీఎల్ మ్యాచుల్లోని చివరి ఓవర్లలో ఎక్కువగా బలైపోయేది బౌలర్లే. అలాంటిది అర్షదీప్.. అదే చివరి ఓవర్ వల్ల బీసీసీఐకి లక్షల్లో నష్టం చేకూర్చాడు.
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఓడిపోయింది. వరసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఊపు మీద కనిపించింది. కానీ పంజాబ్ కింగ్స్ దెబ్బకు చతికిలపడిపోయింది. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ముంబయి గెలిచేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ చివరి ఓవర్ లో అర్షదీప్ సింగ్ అద్భుతం చేశాడు. తన పేస్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో గెలవడం ఏమో కానీ బీసీసీఐకి అర్షదీప్ వల్ల భారీ నష్టం ఏర్పడింది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది.
ఇక విషయానికొస్తే.. వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 214/8 భారీ స్కోరు చేసింది. 83-4 స్థితిలో ఉన్నప్పుడు పంజాబ్ జట్టు 150 రన్స్ కొడితే గొప్ప అనుకున్నారు. అలాంటిది సామ్ కరన్ 55, హర్ ప్రీత్ సింగ్ 41, జితేష్ శర్మ 25 వల్ల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి బాగానే ఆడింది. చివరి ఓవర్ లో 16 రన్స్ కొట్టాల్సిన స్థితిలో అర్షదీప్ బౌలింగ్ కి వచ్చాడు. కేవలం రెండు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో పంజాబ్ గెలిచేసింది.
చివరి ఓవర్ లో తిలక్ వర్మ, నేహల్ వదెరా ఔటయ్యారు. కానీ అర్షదీప్ ఈ ఇద్దరినీ ఔట్ చేసినప్పుడు మిడిల్ వికెట్ ని రెండుసార్లు తన బౌలింగ్ తో ఇరగ్గొట్టాడు. అయితే స్టంప్స్ సెట్ ధర దాదాపు రూ.30 లక్షలు అంటే.. అర్షదీప్ వల్ల రూ.20 లక్షల వరకు బీసీసీఐ నష్టపోయినట్లు తెలుస్తోంది. ఏదో ఒకసారి అంటే అనుకోవచ్చు కానీ ఇలా ఒకే ఓవర్ లో రెండుసార్లు స్టంప్ విరిగిపోవడమనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి అర్షదీప్ బౌలింగ్ దెబ్బకు స్టంప్స్ విరిగిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Probably the most expensive over:
Arshdeep Singh broke the middle stump twice – a set of LED stumps with Zing bails cost 30 Lakhs INR. pic.twitter.com/A0m0EHyGM8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2023