ఐపీఎల్ 2022లో అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ లెవల్స్ను మరోసారి చూపించాడు. అది కూడా ధోని లాంటి మాస్టర్మైండ్ కోసం ప్లాన్ సెట్ సక్సెస్ అయ్యాడు. ముంబై బౌలర్లు విజృంభించడంతో చెన్నై బ్యాటర్లు పెవిలియన్కు క్యూకట్టారు. కానీ.. ధోని ఒక్కడే చివరి వరకు క్రీజ్లో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. అందరూ అవుట్ అవుతున్నా.. అప్పటికే 9 వికెట్లు పడినా ధోని మాత్రం లొంగడంలేదు.
చివరి బ్యాటర్ ముఖేష్ చౌదరితో కూడా భాగస్వామ్యం నెలకొల్పాలని చూశాడు ధోని. ఓవర్ మొత్తం తానే ఆడి.. చివరి బంతికి సింగిల్ తీసుకుని తర్వాతి ఓవర్ కూడా తానే ఎదుర్కొనే ప్లాన్ వేశాడు. ధోని గురించి తెలిసిన రోహిత్ శర్మ.. అతని ‘సింగిల్ ఆన్ లాస్ట్బాల్’ స్ట్రాటజీని బ్రేక్ చేయాలనుకున్నాడు. అందుకోసం మెరిడిత్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రోహిత్ శర్మ తన ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేశాడు. 16వ ఓవర్ తొలి బంతిని ఫోర్, నాలుగో బంతిని సిక్స్ బాదిన ధోని మిగిలిన బంతుల్లో రన్స్ తీయకుండా స్ట్రైక్ తన వద్దే పెట్టుకున్నాడు. కానీ.. తర్వాతి ఓవర్ కూడా ఆడాలంటే చివరి బంతికి సింగిల్ తీయాలి.ధోని కచ్చితంగా సింగిల్ కోసమే వెళ్తాడని ముందే పసిగట్టిన రోహిత్ శర్మ.. ఆ ఒక్క పరుగుకు ఛాన్స్ లేకుండా ఫీల్డ్ను సెట్ చేశాడు. మెరిడిత్ చివరి బంతిన షార్ట్ బౌన్సర్ వేశాడు. దాన్ని ఆడకుండా ధోని పరుగు కోసం వెళ్లాడు. వెంటనే కీపర్ ఇషాన్ కిషన్ బంతి అందుకుని వికెట్లకు కొట్టాడు. ధోని అంత వేగంగాలేని ముఖేష్ చౌదరి రన్ అవుట్ అయ్యాడు. దీంతో CSK ఇన్నింగ్స్కు తెరపడింది. ధోని సింగిల్ ఆన్ లాస్ట్ బాల్ను బ్రేక్చేసే ప్లాన్ గురించి ఇషాన్కు రోహిత్ శర్మ ముందే చెప్పడంతో.. దాని కోసం ఇషాన్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. అనుకున్నట్లే ధోని సింగిల్ కోసం ప్రయత్నించాడు. చివరి బ్యాటర్ అవుట్ అవ్వడంతో ధోని నాటౌట్గా నిలిచినా ఫలితం లేకపోయింది.
అలా సింగిల్ కోసం ప్రయత్నించకుండా ముఖేష్కు స్ట్రైక్ ఇచ్చినా ఉపయోగం ఉండదని ధోనికి తెలుసు.. ధోని అతనికి స్ట్రైక్ ఇవ్వడని రోహిత్కు తెలుసు. ఇలా ఇద్దరు తమ ప్లాన్ ప్రకారం ఆడగా.. చివరికి రోహిత్ శర్మ పైచేయి సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ(32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) కడవరకు నిలిచి విజయాన్ని లాంఛనాన్ని పూర్తి చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. మరి మ్యాచ్ అనంతరం ధోని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: ముంబై చేతిలో చెన్నై చిత్తు! గుణపాఠమన్న ధోని
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.