ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు చేరింది. కాగా రాజస్థాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్ అత్యుత్తమంగా రాణించాడు.
ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. “మెక్కాయ్ తల్లి క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని”సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ తలపడనుంది. ఆదివారం అహ్మాదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ హాట్ పేవరేట్గా బరిలోకి దిగనుంది. క్వాలిఫైయర్ 1లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐపీఎల్ ట్రోఫీని రెండో సారి ముద్దాడుతుందని రాజస్థాన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కప్పుతో RCB టీమ్ సంబరాలు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో
Thank you @rajasthanroyals https://t.co/32oNgWJoQ6
— Obed McCoy (@ObedCMcCoy) May 27, 2022