ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో 14 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో లక్నో ఐపీఎల్ 2022లో తమ ప్రస్థానం ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 112 నాటౌట్), చివర్లో దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులకే పరిమితమై ఈ టోర్నీ నుంచి వైదొలిగింది.
ఇక ఈ మ్యాచ్లో లక్నో ఫీల్డింగ్ వైఫల్యం ఆ జట్టును ఘోరంగా దెబ్బతీసింది. ఆ జట్టు నాలుగు కీలక క్యాచ్లు మిస్ చేసుకోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇక లక్నో బ్యాటింగ్లోనూ చాలా తడబడింది. ఇక లక్నో బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను డగౌట్లో కూర్చుని గమనిస్తున్న ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో ఫ్రస్టేట్ అయ్యాడు. గట్టిగా అరుస్తూ.. తలపై చేతులు పెట్టుకుంటూ కోపంగా కన్పించాడు. ఈ సీజన్లో లక్నో ఓ మ్యాచ్లో కోల్కత్తా చేతిలో దారుణంగా ఓడిపోయినప్పుడు గంభీర్ క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. గంభీర్ ఇప్పుడే కాదు తాను ఆడే రోజుల్లోనూ ఎంతో అగ్రెసివ్ ప్లేయర్గా కన్పించేవాడు. ఇక తాజా మ్యాచ్లో గంభీర్ ఫ్రస్టేషన్ పీక్స్కు చేరుకుంది.
మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో చాలా విచారకరంగా మాట్లాడాడు. రాహుల్తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్గా కూడా మారాయి. ఈ ఫొటోలో గంభీర్ రాహుల్కు క్లాస్ పీకినట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం గంభీర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఓటమి గురించి భావోద్వేగంతో కూడిన పోస్టు ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ‘ఈ రోజు హార్డ్ లక్. ఈ సీజన్లో కొత్త టీం అయినప్పటికీ మా లక్నో టీం ఎంతో ఆకట్టుకునేలా ఆడింది. తప్పకుండా తర్వాతి సీజన్కు మరింత బలంగా తిరిగి వస్తాం.’ అని గంభీర్ పేర్కొన్నాడు. లక్నో టీం ఎలిమినేటర్లోనే తన ప్రయాణం ముగించినప్పటికీ ఆ జట్టులో ఒకరిద్దరు మంచి ప్లేయర్లు వెలుగుచూశారు. వారిలో మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీ చెప్పుకోదగ్గ ఫ్యూచర్ స్టార్లు ఉన్నారు. మరి గంభీర్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Deepak Hooda: దీపక్ హుడా భారీ సిక్స్.. క్యాచ్ పట్టుకోబోయిన పోలీస్ కు గాయాలు! వీడియో వైరల్!