గత కొన్ని రోజుల నుంచి వరుస గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సోడియం వాడకంపై నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు చేసింది. అవేంటంటే?
గత కొన్ని రోజుల నుంచి చాలా మంది గుండెపోటు, పక్షవాతం వంటి రోగాలతో అకాల మరణాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురై పిట్టాల్లా రాలిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. గుండెపోటు, అకాల మరణాలపై స్పందించి కొన్ని కీలక ప్రతిపాదనలు పాటించాలని కోరింది.
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటూ లేనిపోని రోగాల భారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా మనం తినే ఆహార పదర్థాల్లో సోడియం ఎక్కువగా ఉన్నవాటిని తీసుకుంటూ హార్ట్ స్ట్రోక్, పక్షవాతం వంటి రోగాల బారిన పడుతూ మృత్యువాతపడుతున్నారు. 2025 నాటికి సోడియం వాడకం 30 శాతం తగ్గించాలనే లక్ష్యాన్ని ఎవరూ గ్రహించడం లేదని, దీని కారణంగానే అధిక సోడియంను తీసుకుంటూ గుండెపోటు మరణాలకు గురువుతన్నారని WHO ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సోడియం వాడకంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా ఓ నివేదికను విడుదల చేయడం విశేషం.
సోడియం అనేది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. అంతే కానీ, చాలా మంది దానిని ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. WHO నివేదిక ప్రకారం.. సగటున రోజూ 5 గ్రాముల సోడియం తీసుకోవాలి. తీసుకోవాల్సిన దాని కంటే 5 గ్రాములు ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగానే పక్షవాతం, హార్ట్ స్ట్రోక్ వంటి రోగాలతో చాలా మంది చనిపోతున్నారని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనోమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సోడియం వాడకంపై WHO ప్రపంచ దేశాలకు Best Buys లో కొన్ని ప్రతిపాదనలు పొందుపరిచింది. వీటిని అన్ని దేశాలు ఖచ్చితంగా పాటించాలని కోరింది.
సోడియం వినియోగంపై WHO నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు: