Raksha Bandhan 2022: ఈ ఏడాది రక్షా బంధన్ విషయంలో గందరగోళం నెలకొంది. ఆగస్టు 11న జరుపుకోవాలని కొందరు.. లేదు ఆగస్టు 12వ తేదీన జరుపుకోవాలని మరికొందరు.. రాఖీ కట్టే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇంతకీ ఏ రోజు రాఖీ కట్టాలి.. 11వ తేదా?.. లేక 12 తేదా?.. అన్నదానిపై ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కొన్ని కార్యక్రమాల్ని అనుసరించి.. వ్రతాధినియమాలకు సూర్యుడు ఉదయించే సమయానికి ఏ తిధి ఉంటుందో దాన్నే పరిగణించాలి. ఈ సారి పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ గురువారం ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు కొనసాగుతుంది.
వ్రత నియమాలకు, కృపా కర్మలకు మనం సూర్యోదయం స్పర్శ ఉన్న తిధి ఆగస్టు 12వ తారీఖును రక్షా బంధన్గా పరగణించాలి. వ్రతాలు చేసుకునేవారు ఆగస్టు 12వ తేదీ ఉదయం లోపు చేసుకోవాలి. ఇక రాఖీ కట్టే విషయానికి వస్తే.. ఆగస్టు 11వ తేదీన సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టొచ్చు. శ్రావణ పూర్ణిమ నాడు ఉదయం 09:34 నుండి సాయంత్రం 04:26 వరకు భద్ర సమయం ఉంటుంది. ఈ కాలంలో రాఖీ పండుగ జరుపుకోకూడదు. సాయంత్రం 04:26 తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టడం మంచిది.
ఇవి కూడా చదవండి : Sita Ramam Collections: ‘సీతారామం’ 5వ రోజు కలెక్షన్స్.. ‘తగ్గేదే లే’..