నిరాడంబరుడు.. ఆధునిక భాషలో చెప్పాలంటే డౌన్ టూ ఎర్త్ పర్సన్ ఆ మహా శివుడు. తన దగ్గర ఏమీ లేకపోయినా భక్తులకు కావాల్సినవి సమకూర్చి పెడతారని పెద్దలు చెబుతారు. మహా శివరాత్రి రోజున శివుని అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా శివరాత్రి నాడు ఇలా చేస్తే తొలగిపోతాయని శివ పురాణంలో చెప్పబడింది.
మహా శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 18న వచ్చింది. ఈరోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ మహా శివరాత్రి నాడు శని ప్రదోష, సర్వార్థ సిద్ధి వంటి మహా యోగాలు చేస్తారు. అందుకే ఈరోజు చాలా ప్రత్యేకం. అందుకే శివరాత్రి రోజున శివుడి పట్ల అత్యంత భక్తి భావంతో ఉంటారు. ఉపవాసం, జాగరణ, ధ్యానం వంటివి చేస్తూ శివుడికి ఆధ్యాత్మికంగా మరింత దగ్గరవుతారు. భక్తులకు ఉన్న సమస్యలను ఆ పరమేశ్వరుడు తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. మన పురాణాల్లో మానవుల సమస్యలకు పరిహారాలు ఉన్నాయని పండితులు చెబుతారు. అలానే శివ పురాణంలో కూడా మానవుల సంక్షేమం కోసం అనేక పరిహారాలు పొందుపరిచారని చెబుతారు.
ఈ పరిహారాలు చేయడం వల్ల శివుని అనుగ్రహంతో పాటు రుణ విముక్తి పొందవచ్చునని అంటారు. ఈరోజుల్లో అప్పు లేని మనిషి లేరు. ప్రతి ఒక్కరికీ ఏదో అవసరం పడి అప్పు చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఆ రుణభారం తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది. వచ్చిన ఆదాయం అంతా అప్పులకే పోతుంటుంది. అయితే శివ పురాణంలో రుణ విముక్తి కోసం కొన్ని పరిహారాలు ఉన్నాయి. మహా శివరాత్రి నాడు ఈ విధంగా చేస్తే అప్పుల బాధ నుంచి బయటపడడమే కాకుండా ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది. శివ పురాణం ప్రకారం.. మహా శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి నేతిలో ముంచిన నువ్వులతో శివలింగానికి అభిషేకం చేస్తే రుణ విముక్తులవుతారు. నెయ్యి కలిపిన నువ్వులను ఒక్కొక్కటిగా శివ లింగానికి అభిషేకం చేస్తూ.. ఓం నమఃశ్శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తులయ్యేందుకు ఆ శివుడు ఒక దారి చూపిస్తారని చెప్పబడింది.
ఇక శివ లింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పబడింది. సూర్యాస్తమయం తర్వాత, రాత్రికి ముందు వికసించే చెట్టు కింద ఆవనూనెతో చేసిన నాలుగు దీపాలను వెలిగించి.. ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తే రుణ విముక్తులవుతారని చెప్పబడింది. ఈ మహా శివరాత్రి నాడు శని ప్రదోష వ్రతం జరుపుతారు. శివుడికి బిల్వపత్రం చెట్టు అంటే ఎంతో ప్రీతి. ఆ బిల్వపత్రం చెట్టు కింద పేదలకు, బ్రాహ్మణులకు అన్నం పెడితే ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయని శివ పురాణంలో చెప్పబడింది. శివుని శక్తి భక్తుడిపై ఉంటుందని చెప్పబడింది. మహా శివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం సహా అనేక యోగాలు జరుగుతాయి. ఈ యోగంలో పాలుపంచుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఓం రిన్ ముక్తేశ్వర్ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ నువ్వులను, పప్పులను సమర్పిస్తే ఆర్థికంగా బలపడి రుణ విముక్తులవుతారని చెప్పబడింది.