దేశ వ్యాప్తంగా హొలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. ఎక్కడ చూసిన రంగుల కేళీ. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆనందంగా హూలీ సంబరాల్లో మునిగిపోతుంటారు. హూలీ రోజు ముందే వీధుల్లో పిడకలు, పాత వస్తువులు కుప్పబోసి మంటలు వేస్తారు..
దేశంలో హూలీ సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. హూలీ అంటే రంగుల కేళీ. చిన్నా పెద్దా.. ఆడా మగా అనే తేడా లేకుండా సంతోషంతో రంగులు పూసుకోవడం.. రంగునీళ్లు చల్లుకోవండం లాంటి వచేస్తారు. ఇక కామదహనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హూలీ రోజు ముందే వీధుల్లో పిడకలు, పాత వస్తువులు కుప్పబోసి మంటలు వేస్తారు. సాధారణంగా హూలీ రోజు కోడిగుడ్లు, టమాటోలు, రంగు బెలూన్స్ వంటి వాటితో రంగుల కేళీ హూలీ ఆడుతుంటారు. కానీ ఓ చోట మాత్రం విషపూరితమైన తేళ్లతో హూలీ వేడుకలు సంబరంగా జరుపుకుంటారు. ఈ వింత వేడుక ఉత్తర్ ప్రదేశ్ ఇటావా జిల్లాలో జరుపుకుంటారు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా తేళ్లంటేనే మనకు చచ్చేంత భయం.. విషంతో కూడిన తేలు కుడితే మంట తట్టుకోవడం కష్టం..కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అలాంటిది ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో పరిధిలో హోలీవేడుకల్లో మాత్రం తెళ్ల సందడి కనిపిస్తుంది. హూలీ రోజు ఎటు చూసినా తెళ్లు దర్శనమిస్తుంటాయి. ఈ గ్రామంలో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తేళ్లతో హూలీ ఆడుతూ.. ఒకరిపై ఒకరు విసురుకున్నప్పటికీ గ్రామస్తులను తేళ్లు ఏమీ అనకపోవడం విశేషం. ఈ ఆచారం ఇప్పటి నుంచి కాదు.. అనాధిగా వస్తుందని ఇక్కడ వాళ్లు అంటుంటారు.. ఎంత విషపూరితమైన తేళ్లు అయినా తమకు చిన్న హాని కూడా తలపెట్టవు అని అంటున్నారు.
ఇటావా జిల్లాలోని సాత్నా గ్రామంలో భైసన్ అనే పురాతన కాలం నాటి ఒక కోట ఉంది. ఈ కోటలో వేలదిగా ఇటుకలు, రాతి ముక్కలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఇక్కడ రాళ్ల దిబ్బలు, ఇటుకల్లో తేళ్లు కనిపించవు… కానీ హూలీ పౌర్ణమి రెండవ రోజు సాయంత్రం కాగానే ఇటుకలు, రాళ్ల మద్య నుంచి వేలాదిగా తేళ్ళు బయటకు వస్తుంటాయి. అదే సమయంలో గ్రామస్థులు మట్టిదిబ్బల వద్దకు తరలి వస్తుంటారు. ఆ తేళ్లను తమ చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటూ హూలీ ఆడుతుంటారు. ఈ గ్రామస్థులు తేళ్లను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అవి కూడా ఎలాంటి హీనీ తలపెట్టకపోవడం విశేషం. తేళ్లతో హూలీ ఆడే సాంప్రదాయం చుట్టు పక్కల గ్రామాల వారికి తెలియడంతో బైసన్ కోట వద్దకు ఇతర జిల్లాల నుంచి ప్రజలు చేరుకొని తేళ్ళు బయటకు వచ్చే వరకు వేచి చూసి తర్వాత హూలీ జరుపుకుంటున్నారు.
ఈ తేళ్ళ సాంప్రదాయం గురించి గ్రామస్థుడు కృష్ణ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ‘హూలీ పౌర్ణమి రెండవ రోజు సాయంత్రం గ్రామస్థులంతా హూలీ పాటలు పాడతారు.. అప్పుడు కోటల వద్ద ఉన్న ఇటుకలు, మట్టి దిబ్బల నుంచి తేళ్లు అనేకం వస్తాయి. వాటిని తీసుకొని చిన్నా పేద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరం విసురుకుంటాం.. ఈ సంప్రదాయం వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుందని మా పూర్వికులు చెబుతుంటారు. ఆ ఆచారాన్ని మేం కొనసాగిస్తున్నాం. మట్టిదిబ్బ నుంచి వచ్చిన తేళ్ల ఆశీర్వాదం తీసుకొని అక్కడే వదిలేస్తాం.. మరుసటి రోజు అక్కడికి వెళ్తే ఒక్క తేలు కూడా కనిపించదని’ ఆయన తెలిపారు.