మన దేశంలో ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక అనేక ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం దేవుళ్లను పూజించే విధానం, భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే అనేక దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడకు వచ్చి ఆలయాలు సందర్శిస్తారు ఈ పద్దతులు సంప్రదాయాలు తెలుసుకంటారు. ఇక్కడ దేవుడికి పెట్టే నేవైద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి. ఆలయాల్లో లడ్డూ పులిహోర చక్కెర పొంగలి ఇలాంటివి ప్రసాదంగా పెడతారు. అయితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా లో ప్రత్యేక ఆలయం ఉంది. అక్కడ అమ్మవారికి నైవేద్యంగా న్యూడుల్స్ పెడతారు. ఈ దేవాలయానికి ‘చైనీస్ కాళీ టెంపుల్’ అని పేరు. అంతేకాదు.. టిబెటన్, తూర్పు ఆసియా సంప్రదాయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే దేశ, విదేశీ పర్యటకుల్ని అధికంగా ఆకర్షిస్తుందని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలకు వెళ్తే ఇక్కడ అంతా చైనా జపాన్ లో ఉన్నట్లు ఉంటుంది. అక్కడకు చాలా మంది విదేశీ పర్యాటకులు వెళుతూ ఉంటారు. ఇక్కడ కాళీ మాత ఆలయంలో భక్తులు న్యూడిల్స్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదే ప్రసాదంగా భక్తులకి ఆలయంలో ఇస్తారు ఇక్కడ చాలా మంది చైనీయులు ఉన్నారు. వారంతా ఇండియాలో స్థిరపడిపోయారు. వారు ఇలా న్యూడిల్స్ అనేది ప్రసాదంగా ముందు నుంచి ఇవ్వడం ప్రారంభించారు.
గత 20 ఏళ్లుగా బెంగాలీ ప్రజలు, చైనా ప్రజలు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. దాదాపు ఈ ఆలయం 60 ఏళ్ల నుంచి ఉందని చెబుతున్నారు. కాళీ మాత ఆలయం మన దేశంలోని ఇతర కాళీ మాత ఆలయాలలాగే ఉంటుంది. కాళీ మాత కూడా అలాగే ఉంటుంది. ప్రత్యేకతల్లా ప్రసాదమే. ఎంత మంది భక్తులు వచ్చినా అమ్మవారికి నైవేద్యం సమర్పించాక భక్తులకు న్యూడుల్స్ ప్రసాదంగా ఇస్తారు. నూడుల్స్తోపాటూ చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ఇస్తారు. అందువల్ల ఇక్కడికి వెళ్లిన వారికి కొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంది.