ఈ మద్య దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పట్టపగలు మహిళలు ఒంటరిగా తిరగాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మహిళలను లొంగదీసుకొని మోసం చేయడమే కాదు.. పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ టీవీ యాంకర్ ని ప్రేమించానని చెప్పి లొంగదీసుకొని మోసం చేసిన యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..
చెన్నై ఈ రోడ్ కి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా లోకల్ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే కొంత కాలం క్రితం రాహూల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట ఫ్రెండ్స్ గా ఉన్న ఇరువురు తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ జంట మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తుంది. కొంతకాలం క్రితం కోవైలో జరిగిన ఓ ప్రోగ్రామ్ కి ఇద్దరు వేళ్లారు. ఇద్దరూ ఒక హూటల్ తీసుకొని కొన్నిరోజులు అక్కడే ఉన్నారు.. ఆ సమయంలో యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడు.
రాహూల్ మాటలు విన్న ఆ యువతి లొంగిపోవడమే కాదు.. తన వద్ద ఉన్న బంగారం కూడా ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాహూల్ లో మార్పు రావడం.. ఆ యువతిని సైడ్ చేయడం గమనించి తనను దారుణంగా మోసం చేశాడని అర్థం చేసుకుంది. ఈ క్రమంలో ఆగస్టులో ఈరోడ్డ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తులో రాహూల్ ఆ యువతిని మోసం చేసినట్లు తేలింది. నేరం రుజువు కావడంతో రాహూల్ కి రూ.5 వేల జరిమానాతో పాటు పదేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.