ఆకలి నింపాల్సిన బిర్యానీ యువతి ప్రాణాలు బలిగొంది. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన యువతి ఆసుపత్రిలో చేరింది. ఆపై కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరఘడ్ కు చెందిన అంజుశ్రీ పార్వతి(20) అనే యువతి డిసెంబర్ 31న దగ్గర్లోని రొమాన్సియా అనే హోటల్ నుంచి ‘కుజుమంతీ’ అనే పేరు గల బిర్యానీని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అది తిన్నప్పటి నుంచి వాంతులు, విరేచనాలతో బాధ పడ్డ ఆమె అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉంది. మొదట స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందించగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆమెను కర్ణాటకలోని మంగళూర్కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతున్న అంజుశ్రీ నేడు తుది శ్వాస విడిచింది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహానికి పోస్టు మార్టమ్ జరుగుతోంది. ఆ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ దర్యాప్తు చేసి వెంటనే రిపోర్టు అందించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిషన్ సైతం అప్రమత్తమైంది. కాగా వారంలో ఇది రెండో ఘటన. డిసెంబర్ 29న కొట్టాయంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఓ నర్సు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించింది. కోజికోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Bengaluru | In another suspected case of food poisoning, a 20-year old woman died after allegedly consuming Kuzhimanthi, a biryani dish from a local hotel. https://t.co/8jVnBBDx2Z
— Hindustan Times (@htTweets) January 7, 2023