విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పలుమార్లు కన్న కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ఆపై ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తండ్రీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చే ఘటన విశాఖలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమాజం తలదించుకునేలా ఓ తండ్రి ప్రవర్తించాడు. కూలీ పనులు చేసుకుంటున్న ఆ తండ్రి గత కొంత కాలంగా భార్య, కూతురిన వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోన మద్యానికి అలవాటైన తండ్రి కూతురుపై కన్నుపడింది. హాస్టల్ లో చదువుతున్న ఆ బాలిను వారం వారం ఇంటికి తీసుకు వచ్చి అత్యాచారం చేసేవాడు.. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే తల్లితో పాలు నిన్నూ కూడా చంపేస్తా అని బెదిరించేవాడు.
ఇటీవల కుమార్తెను హాస్టల్ నుంచి తీసుకు వచ్చి అత్యాచారానికి పాల్పపడ్డాడు. ఈ దారుణ ఘటనను తల్లి చూడటంతో ఒక్కసారిగా షాక్ కి గురైంది. వెంటనే తన కూతురుని తీసుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట దుర్మార్గుడైన ఆ తండ్రికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: భర్త టీనేజ్ బాలికను అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన భార్య!