దేశంలో అఘాయిత్యాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న కొందరు దుర్మార్గులు 5 ఏళ్ల చిన్నారి నుంచి పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ దంపతులు ఎవరూ ఊహించని దారుణానికి తెర లేపారు. భర్త ఓ టీనేజ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా భార్య పక్కనుండి వీడియో తీసింది. ఇలా బరితెగించి దారుణానికి పాల్పడిన ఈ దంపతుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బదౌన్ గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే స్థానికంగా ఉండే ఓ టీనేజ్ బాలికపై ఆమె భర్త కన్ను పడింది. దీంతో ఎలాగైన ఆ బాలికను వశపరుచుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ పాపను ఓ రోజు ఇంట్లోకి రప్పించుకుని అఘాయిత్యం చేశాడు. ఇది చూసిన భార్య అడ్డు చెప్పాల్సింది పోయి భర్తకు వత్తాసు పలికింది. ఇక ఇంతటితో ఆగకుండా భర్త చేసే పనిని వీడియోలు తీసి ఆడతనానికే మచ్చ తెచ్చింది.
ఇది కూడా చదవండి: ఆమె ఇంగ్లీష్ టీచర్! ఎవ్వరికీ చెప్పకుండా విహారయాత్రకి వెళ్లి..!
అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ ఆ బాలికను బెదిరించడం మొదలు పెట్టారు. ఇక కొన్ని రోజుల తర్వాత బాలిక వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లుగా వివరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు దారుణానికి పాల్పడ్డ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆడతనానికే మచ్చతెచ్చిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.