ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు చూస్తూనే ఉన్నాం. ప్రేమంటూ ఓ యువతి చుట్టూ తిరిగి.. ఆమె ప్రేమను పొందిన యువకుడు తన ప్రవర్తనతో దూరం చేసుకున్నాడు. నీలాంటి బాధ్యతలేని వాడు నాకొద్దంటూ ఆమె గుడ్ బై చెప్పేసింది. అది మనసులో పెట్టుకున్న యువకుడు ఓ రోజు కళాశాలలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. ఆ కేసులో హత్య చేసిన యువకుడికి ఫాస్ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధిచింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కరూర్ లోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆదియనందాల్ లో ఉదయ్ కుమార్ అనే యువకుడు ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. అదే కళాశాలలో సోనాలి(21) చేరింది. ఉదయ్ కుమార్- సోనాలి మధ్య పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఉదయ్ కుమార్ మొదట్లో బాగానే చదివేవాడు. కళాశాలకు కూడా బాగానే హాజరయ్యేవాడు. కానీ, రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.
జులాయిగా తిరగడం మొదలు పెంట్టాడు. ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగడం, పోకిరిగా తిరుగుతుండటం, కాలేజీకి రాకపోవడం చేశాడు. అతని ప్రవర్తన చూసిన కళాశాల యాజమాన్యం మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు అంగీకరించలేదు. అతనికి ఎంతగానో చెప్పి చూసిన సోనాలి.. ప్రవర్తన మార్చుకోకపోవడంతో గుడ్ బై చెప్పేసింది. కళాశాలలో పరీక్షలు రాయనీయకపోవడం, మరోవైపు సోనాలి కూడా వదిలేయడంతో ఉదయ్ కుమార్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఎలాగైనా ఆమెపై పగ తీర్చుకోవాలని చూశాడు. ఓ రోజు కళాశాలలో అందరూ చూస్తుండగానే కాలేజ్ క్యాంపస్ లో కత్తితో దారుణంగా సోనాలీని పొడిచేశాడు. అడ్డుకోబోయిన ప్రొఫెసర్ కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన 2016 ఆగస్టు 30న జరిగింది. ఆ ఘటనపై విచారణ జరిపిన ఫాస్ట్రాక్ కోర్టు ఉదయ్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది. తన ప్రవర్తనతో చదువు పోగొట్టుకుని, ప్రేమించిన అమ్మాయిని హత్య చేసి జీవితం కూడా పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.