ఈ మద్య కాలంలో పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల మనస్థాపానికి గురై చాలా మంది విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఓ తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురుని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా పాణ్యం మండలానికి చెందిన దేవేందర్ రెడ్డి కి ప్రసన్న అనే కూతురు ఉంది. ప్రసన్నకు ఇటీవల జిల్లెల గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. భర్తతో హైదరాబాద్ లో కాపురం చేస్తున్న ప్రసన్న. ఇటీవల భార్యాభర్తల మద్య గొడవలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది ప్రసన్న. అప్పటి నుంచి భర్త వద్దకు వెళ్లనని మారాం చేసింది. గొడవలు సర్ధిచెబుతాం.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి బిడ్డకు ఎంతగానో నచ్చజెప్పాడు. ఈ క్రమంలోనే ప్రసన్న వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే కాపురానికి వెళ్లకుండా ఇలా ప్రవర్తిస్తుందని భావించిన దేవేందర్ రెడ్డి బిడ్డపై కోపం పెంచుకున్నాడు. నలుగురి ముందు తన పరవు తీసేసిందని భావించి ఆమెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ నెల 10వ తేదీన అందరూ నిద్రపోతున్న వేల ప్రసన్న గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత కొంతమంది సహాయంతో ప్రసన్న మృతదేహాన్ని నల్లమల ఘాట్ రోడ్డు ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా తల, మొండెం వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరివేశాడు. ప్రసన్న తాత శివారెడ్డి ఆమెకు ఎంతఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి దేవేందర్ రెడ్డిని నిలదీశాడు. దీంతో తన కూతురు చేసిన పనివల్ల తన పరువు పోయిందని.. పదిమంది ముందు తలెత్తుకోలేని పరిస్థితికి కారణమైన ఆమెను చంపేశానని చెప్పాడు.
కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహం పడవేసిన చోటికి వెళ్లి శిథిలాలను సేకరించి పోస్ట్ మార్టం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. దేవేందర్ రెడ్డి అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కూతురు వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే తన పరవు పోయిందని కోపంతో చంపేశానని విచారణలో దేవేందర్ రెడ్డి తప్పును ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.