ఇటీవల దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒకదశలో మహిళలు పట్టపగలు బయట తిరగాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
wఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు, హత్యల పరంపర కొనసాగుతుంది. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే భయపడే దారుణమైన పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ ప్రతిరోజూ అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. రోజు రోజుకీ వారి ఆగడాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ మహిళా లెక్చర్ ఒంటరిగా వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆమెపై అత్యంత పాశవికంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య స్థానికులు షాక్ కి గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నడిరోడ్డుపై పట్టపగలు ఓ మహిళా లెక్చరర్ని ఇద్దరు యువకులు దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని.. మహిళలకు భద్రత లేకుండా పోతుందని మరో సంఘటన రుజువు చేసింది. మదనపల్లిలో ఒంటరిగా రోడ్డుపై నడిచి వస్తున్న ఓ మహిళా లెక్చర్ ని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది. దుండగులు తమ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటన చూసిన స్థానికులు ఒక్కసారే భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
పట్టపగలు ఆమెను వెంబడించి నింధితులు పక్కా ప్లాన్ ప్రకారమే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఆమె ఒంటరిగా ఉందని.. కత్తులతో దాడి చేసి చనిపోయిందని తెలుసుకొని నింధితులు అక్కడ నుంచి పరార్ అయినట్లు తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని.. నింధితులను త్వరలో పట్టుకుంటామని అంటున్నారు. మొత్తానికి మదనపల్లిలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.