గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు యువతను మత్తుకు బానిసలు గా చేస్తున్నారు. గంజాయి మత్తులో జూగుతున్న యువకులు విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆ మద్య హైదరాబాద్ లో గంజాయి మత్తులో పోలీసులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా నగరంలో దారుణం చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ హసన్ నగర్ లో కొంత మంది గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయారు. ఎనిమిది మంది యువకులు గంజాయి మత్తులో హలీమ్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో దాడిచేశారు.. ఆ తర్వాత చెరువులో పడేసి పారిపోయారు. యువకుడి అరుపులు కేకలు విని చెరువులో నుండి బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనని చంపడానికి దుండగులు ఆస్పత్రికి కూడా వచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు హలీమ్.
ఇదిలా ఉంటే.. ప్రతి రోజు రాత్రి 10 గంటలు దాటింది అంటే చాలు కొంత మంది యువకులు గాంజాయి సేవించి మత్తులో రోడ్డుపై వస్తున్నవారిపై కత్తులతో దాడి చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని హసన్ నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి: రాజేంద్రనగర్ హసన్ నగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. హలీమ్ అనే యువకుడిపై కత్తులతో దాడి. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చెరువులో పడేసి పారిపోయిన ఎనిమిదిమంది దుండగులు. #Rangareddy #Ganjaigang
— NTV Breaking News (@NTVJustIn) July 28, 2022