దేశంలో పలు చోట్లు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కామాంధులు చిన్న పిల్లల నుంచి వృద్దు మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు.. కొన్నిచోట్ల తమను ప్రేమించలేదనే అక్కసుతో దారుణ హత్యలకు పాల్పపడుతున్నారు.
దేశంలో ప్రతిరోజూ మహిళలపై లైంగిక వేధింపు.. అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్ద అనే వయసు తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు మృగాలుగా మారిపోతున్న లైంగిక వేధింపులు అత్యాచారాలకు పాల్పపాడున్నారు. ప్రేమ పేరుతో వేధించడం కాదంటే చంపేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.. ఓ 16 ఏళ్ల బాలికపై యువకుడు పైశాచికంగా కత్తితో దాడి చేసి చంపాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్దావాకర ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువక ముందే అలాంటి దారుణాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ రోహిణి షహ్బాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక దారుణ హత్య దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ కేసులో హంతకుడు సాహెల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాహెల్ ఏసి, రిఫ్రిజిరేటర్ల మెకానిక్ గా పనిచేస్తాడని వెల్లడించారు పోలీసులు. ఈ దారుణానికి పాల్పపడిన సాహెల్ ని అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని పోలీస్ అధికారి సుమన్ నల్వా తెలిపారు. కాగా, హత్య చేసిన తర్వాత నింధితుడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులందర్ షహర్ కి పారిపోయి తలదాచుకున్నాడని.. అక్కడ అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇక చనిపోయిన బాధితురాలు నిక్కీ (16) గా గుర్తించారు. గత రాత్రి తెలిసిన వాళ్ల బాబు పుట్టిన రోజు పార్టీకి వెళ్లి వచ్చే సమయంలో అందరూ చూస్తుండగానే ఆ బాలికను అడ్డుకొని సాహెల్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమెపై బండరాయి వేశాడు.. చనిపోయిన తర్వాత ఆమెను పదే పదే కాలితో తన్నాడు. ఈ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఏ ఒక్కరూ ఆపలేకపోయారు. బాలిక శరీరంపై 20 కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు మహిళా కమిషన్ త్రిసభ్య కమిషన్ ని నియమించింది. ఈ హత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నింధితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.