ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతుంది. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. పిల్లి పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని భావిస్తుంది.. అదే మాదిరి ఓ జంట తాము డ్రగ్స్ రవాణా చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఉన్నారు. అందుకోసం పక్కా ప్లాన్ కూడా వేశారు. కానీ అదికాస్త బెడిసి కొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు వార్తలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రగ్స్ అమ్మేవారిని రెడ్ హ్యండ్ గా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో శుభమ్ మల్హోత్రా అనే యువకుడు అతడి గర్ల్ ఫ్రెండ్ తో ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. కారులో ఈ ఇద్దరూ గంజాయిని స్మగ్లింగ్ చేసే వారని, ఆ సమయంలో కీర్తి గర్భిణి అని చెప్పి చెక్ పోస్టుల వద్ద పోలీసులను బోల్తా కొట్టించేవారని పోలీసులు తెలిపారు.
ఈ ఇద్దరూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో సింగు సరిహద్దు వద్ద కాపు కాసిన శుభమ్ కారును ఆపాలని ప్రయత్నించినా.. భారీ వర్షానికి తోడు అతడు అత్యంత వేగంగా దూసుకెళ్తుండడంతో పట్టుకోలేకపోయారు. అదే సమయంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి శుభమ్ కారుని వెంబడించారు. చివరికి అతనిడి పట్టుకొని పూర్తి వివరాలు రాబట్టారు. తనకు డ్రగ్స్ అలవాలు ఉందని.. డబ్బు కోసం ఈ దందాలోకి దిగినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: యువకుడికి దారుణమైన శిక్ష విధించిన గ్రామస్తులు.. కారణం ఏంటంటే?