దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను బెంగళూర్ నుంచి హైదరాబాద్ కు ఓ నైజీరియన్ తీసుకొచ్చాడు. హయతన్ నగర సమీపంలో నైజీరియన్.. కొకైన్ ను సరఫరా చేస్తుండా పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అతడి నుంచి 180 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ను ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఇక పట్టుబడిన ఈ నిందితుడి గురించి పోలీసులు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇదే వ్యక్తి గతంలో గుంటూరులో కూడా 48 గ్రాముల కొకైన్ ను అమ్ముతు పట్టుబడ్డాడని, అయితే అక్కడ పోలీసులకు తన పేరు, వివరాలు వేరుగా చెప్పాడాని పోలీసులు తెలిపారు. అక్కడ ఫేక్ ఆధార్, ఫేక్ వీసా, ఫేక్ పాస్ పోర్టు సమర్పించాడు. అప్పట్లో పోలీసులకు.. తాను ఘనా దేశానికి చెందిన వ్యక్తిగా చెప్పాడని, కానీ వాస్తవానికి ఇతడు నైజీరియా దేశానికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. తన వద్ద నైజీరియాకు చెందిన ఒరిజనల్ పాస్ పోర్టు ఉండి కూడా.. వాటిని దాచి పెట్టి.. నకీలి పత్రాలతో అందర్ని తప్పుదోవ పట్టించాడని పోలీసులు వెల్లడించారు. అంతేకాక ఈ నైజీరియన్ వెనక ఏదైనా స్థానిక ముఠాలు ఉన్నాయా? అనేకోణంలో పోలీసులు విచారిస్తున్నారు.