రోడ్డు ప్రమాదాలు.. అధికారులు, సెలబ్రిటీలు ఎంత మంది ఎంత అవగాహన కల్పించినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, అవగాహన లోపం కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోజులో ఏదొక చోట రోడ్డు రక్తమోడుతూనే ఉంది. అలాంటి ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గానికి చెందిన రుద్ర, గణేశ్, సోమశేఖర్.. కర్నూలుకు చెందిన రాజు, గోపి, జాఫర్ లు కారులో అనంతపురం బయలుదేరారు. ఔటర్ రింగ్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో రుద్ర, గణేశ్ సోమశేఖర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోపి, రాజు, జాఫర్లకు తీవ్ర గాయాలు కాగా.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.