ఆమె ఒంటరి మహిళ..పెళ్లై విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన ఇద్దరు యువకులు పదునైన ఆయుధంతో ఆ మహిళపై దాడి చేసి పరారయ్యారు. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్పురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) అనే వ్యక్తి దుబాయ్లోని ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనతో పాటు శ్రీలంకకు చెందిన రోహిణి వసంతి(41) అనే యువతికి కూడా పని చేస్తుండేది.
ఇద్దరు ఒకేచోట పని చేస్తుండడంతో చాలా క్లోజ్ గా కలిసిపోయారు. కొంత కాలం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. ఇక 2005లో ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ రోజులు మారే కొద్ది భార్య పక్క చూపులు చూసి పరాయి మగాళ్ల కోసం ఆరాటపడింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ మహిళ తిరువళ్ళరులోని ఓ ఇంట్లో అద్దెకు దిగి టైలరింగ్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. మంగళవారం అర్థరాత్రి ఆ మహిళ ఇంట్లో ఉండగా ఇద్దరు యువకులు ఇంట్లోకి దూసుకొచ్చి కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
స్పందించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ప్రాణాలతో ఉన్న ఆ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా.. ఈ మహిళ కమలకన్నన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూనే, మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. ఇక దీని కారణంగానే సహించలేని కొందరు ఆమెపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.