ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని లేదు. నేటి కాలం యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు కారణంగా ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. కులాలు వేరైన ఎదురించి మరీ పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. ఇక దీనిని సహించలేని అనేకమంది యువతి తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. కూతురి ప్రియుడిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాగే ఓ జంట పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ప్రియుడి ఇంటికి వెళ్లి కూతురిని కిడ్నాప్ చేశారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన ఈ లవ్ స్టోరీ జయం సినిమాను మించేలా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ. ఇదే ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే యువతి, జన్నారం మండలం మోర్రిగూడెం గ్రామానికి చెందిన కోట నగేష్అనే యువకుడు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఎలాగైన పెళ్ళి చేసుకోవాలనుకుని పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఒప్పుకోరని తెలిసిన నగేష్ హీరోలా అడుగు ముందుకేసి ప్రియురాలిని ఓ గుళ్లో పెళ్ళి చేసుకున్నాడు. అనంతరం నగేష్ లక్ష్మిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంభికులు ఆగ్రహానికి గురయ్యారు. దీనిని అవమానంగా భావించి శుక్రవారం తెల్లవారుజామున ప్రియుడి ఇంటికి వెళ్లి నగేష్ పై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి లక్ష్మిని కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన నగేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన పోలీసులు కిడ్నాప్ వాహనాలను వెంబడించి దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద మూడు వాహనాలను, 17 మంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. సినిమాను తలపించేలా ఉన్న ఈ లవ్ స్టోరీ ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమాను తలపిచేలా ఉన్న ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భర్త మృతదేహం ఇంటికి చేరే లోపే భార్య మృతి!