స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరూ ఫోటోగ్రఫర్లు అయ్యారు. అందమైన ప్రదేశాలు, కట్టడాలు ఏవి కనిపించినా అక్కడికి వెళ్లి సెల్పీలు తీసుకుంటూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు.
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా పుంజుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిత్యం ఏదో ఒక కొత్త పరికరాలు నిపుణులు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లే భావిస్తుంటారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్పీలతో యువత సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. సెల్పీ మోజు ఎంతగా తయారైందటే లైకుల కోసం సాహసోపేతమైన ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో యువకుడు ప్రాణాలు పోగొట్టున్నాడు.. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రకృతిలో అందమైన ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతూ సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తూన్నారు. కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ సెల్ఫీలు తీసుకొని తమ స్నేహితులకు, బంధువులకు షేర్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ సాహసాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నిత్యం ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. అధికారులు ఎంతగా అవగాహన కల్పించినా సెల్ఫీ మోజులో పడి తమ జీవితాలను అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.
విశాఖపట్నం వన్ టౌన్ అల్లీపురం, సింహాచలంకు చెందిన ఏడుగురు ఆదివారం సీతపాలెం సమీపంలో ఉప్పటేరు బీచ్ కి విహారయాత్రకు వెళ్లారు. కొట్టోజు కావ్య, కొట్టోజు సాయిరాం, సాయి ప్రియాంక, రవిశంకర్, కండిపిల్లి ఫణీంద్ర, కండిపిల్లి సాకి కిరణ్ లు రాళ్లపై నిలబడి సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే సమయంలో పెద్ద అల వచ్చి సముద్రంలో కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మృతదేహం కొంతదూరానికి కొట్టుకు వచ్చింది. ఈ ప్రమాదంలో సాయి ప్రియాంక కూడా నీటిలో మునిగిపోయినప్పటికీ మిగతా వారు ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. ఇక సాయిరాం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.