రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలేం జరిగింది? వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మద్ది మల్లారెడ్డి(80), సుశీలమ్మ(76) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు జన్మించారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమారులు నగరంలో ఉండగా, మరో కుమారుడు స్వగ్రామంలోనే ఉంటున్నాడు. అయితే ఈ వృద్ధ దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదిలాఉంటే మల్లారెడ్డి గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అనేక సార్లు ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నా కూడా మళ్లీ అనారోగ్యబారిన పడుతున్నారు. దీంతో ఈ దంపతులు విసుగు చెందారు.
ఇలాంటి బతుకు మాకు వద్దు అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. శనివారం తెల్లవారు జామున ఈ దంపతులు ఇంటి బయట వరండాలో ఉన్న రెండు కిటికీలకు చెరో చోట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఉదయం లేచి పక్కింటి వ్యక్తులు ఈ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇన్నాళ్లు కలిసి జీవించి, కలిసే ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికుల కంట కన్నీరు పెడుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.