తమిళనాడులోని వెల్లూరు సిటీలో ఓ బావిలో శవమై తేలిన సంతోష్ ప్రియ(22) కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. తిరుపత్తూరు జిల్లా కొరటి గ్రామానికి చెందిన సంతోష్ ప్రియ గత నెల 23న హత్యకు గురయ్యింది. తాతయ్యతో కలిసి నివసిస్తున్న సంతోష్ ప్రియ.. టీఎన్పీఎస్సీ పరీక్షలు రాసేందుకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకునేది. జూలై 23వ తేదీన కోచింగ్ సెంటర్ సమీపంలోని బావిలో శవమై ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతోష్ ప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆ యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఉండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
కొన్ని రోజుల నుండి స్విచ్ఛాఫ్ లో ఉన్న మృతురాలి ఫోన్ సోమవారం తిరుపత్తూరు కోట సమీపంలో స్విచ్ ఆన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ స్టైల్లో అతన్ని విచారించగా.. ఒంటరిగా ఉన్న సంతోష్ ప్రియపై లైంగిక దాడి చేసింది తానే అని నిజం ఒప్పుకున్నాడు. లైంగిక దాడి చేసిన తర్వాత సంతోష్ ప్రియని గొంతు నులిమి చంపి మృతదేహాన్ని బావిలో పడేశానని అంగీకరించాడు. నేరం అంగీకరించిన యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువకుడి పేరు మహేంద్రన్ అని, కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. మరి సంతోష్ ప్రియపై లైంగిక దాడి చేసి హత్య చేసిన మహేంద్రన్ ని పోలీసులు అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.