పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అజాగ్రత్త, అతివేగం కారణం అయితే మద్యం సేవించి నడపడం కూడా ఒక ప్రధాన కారణంగా కనబడుతోంది. ఏపీలో అలాంటి ఓ ఘోర ప్రమాదం నుంచి కొందరు ప్రయాణికులు చాకచక్యంగా బయట పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ పూటుగా తాగి స్ట్రీరింగ్ పట్టుకున్నాడు. అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి ప్రాణాలు కాపాడుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విస్సన్నపేట నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన AP 07 TG 123 నంబరు గల బస్సు హైదరాబాద్ బయల్దేరింది. డ్రైవర్ వాలకం చూడగానే ప్రయాణికులకు అనుమానం వచ్చింది. అతని ముఖం వాచిపోయి ఉండటం, మద్యం తాగిన వాసన రావడంతో భయంగానే లోపల కూర్చున్నారు. ఓ ప్రయాణికుడు సోదరుడు కానిస్టేబుల్ కావడంతో సంప్రదించారు. నూజివీడులో ఉన్నామని తెలుసుకుని స్థానిక ఎస్ఐ నంబరు తీసుకుని సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ బస్సును వెంబడించి ఆపేశారు. రెండో డ్రైవర్ బస్సులో నుంచి పారిపోయాడు. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని కిందకు దింపి టెస్టు చేయగా మీటరులో రీడింగ్ 380 వచ్చింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.