విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అందరికి అలాంటి అవకాశం, అదృష్టం రాదు. టాలెంట్తో పాటు ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలించాలి. ఆ యువకుడి విషయంలో ఇలాంటి సమస్యలు ఏవి లేవు. తల్లిదండ్రులు అతడికి అన్ని విధాల సహకారం అందించారు. ఇప్పటికే అన్న విదేశాల్లో చదువుతున్నాడు. తనను కూడా ఫారిన్ పంపించడం కోసం అన్ని రెడీ చేశారు. మరి కొన్ని గంటల్లో విమానం ఎక్కాలి. వెళ్లే ముందు ఒక్కసారి ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి వెళ్లిన యువకుడు.. దారుణ నిర్ణయం తీసుకుని అందరిని ఏడిపించాడు. మరి ఇంతకు ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఏంటి.. అసలు ఏం జరిగింది తెలియాలంటే.. ఇది చదవండి.
ఎన్టీఆర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నందిగామ మండలం హనుమంతుపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్లో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు శివకృష్ణను కూడా ఉన్నత చదువుల కోసం లండన్ పంపేందుకు.. తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు శంషాబాద్లో విమానం ఎక్కి లండన్ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం శివకృష్ణను ఎయిర్పోర్టుకు పంపించడానికి.. అతడి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో హైదరాబాద్కు కారులో బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో శివకృష్ణ.. ఒకసారి తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.
సాయంత్రం ఆరు గంటలైనా శివకృష్ణ ఇంటికి తిరిగి రాలేదు. మరోవైపు ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు సమయం అవుతోంది. దాంతో తల్లిదండ్రులు శివకృష్ణకు కాల్ చేశారు. బయలుదేరుతున్నాను అని చెప్పాడు.. కానీ గంటలు గడుస్తున్నా కూడా ఇంటికి రాలేదు. కాసేపటికి అతడికి కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి సమయం దగ్గరపడుతుండటంతో.. శివకృష్ణ కోసం వెతకడం ప్రారంభించారు. స్నేహితుల దగ్గరకు వెళ్లి అడిగితే.. తమకు కనిపించలేదని చెప్పారు. ఎంత వెతికినా కుమారుడి జాడ కనిపించలేదు.
కొడుకు గురించి ఆందోళన పడుతుండగా.. వారికి పిడుగులాంటి వార్త తెలిసింది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వ కట్ట పక్కన ఉన్న చెట్టుకు శివ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు తెలియజేశారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లాల్సిన కొడుకు.. ఇలా ప్రాణాలు తీసుకోవడం వారి ఇంట విషాదాన్ని నింపింది. విదేశాలకు వెళ్లాల్సిన కొడుకు ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇక శివ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లండన్ వెళ్లడం ఇష్టం లేకే శివ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొడుకు ఇష్టంలోతనే తాము.. అతడు విదేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేశామని.. అలాంటిది.. తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. పైగా లండన్ వెళ్లే ముందు స్నేహితులకు, బంధువులకు పార్టీ కూడా ఇచ్చామని తెలిపారు. అలాగే శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లే సమయంలో కూడా సంతోషంగానే ఉన్నాడని తల్లిదండ్రులు అంటున్నారు. మరి అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.