నిజామబాద్ వైద్య విద్యార్థిని శ్వేత ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ విషాద ఘటనలో మరో నెల రోజుల్లోనే విద్యార్థిని శ్వేత పెళ్లికి సంబంధించి తల్లిదండ్రులు అన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి పీటలపై విశాఖ వధువు సృజన మృతికి సంబంధించి అసలు కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. పెళ్లి కూతురు ఉన్నట్టుండి పెళ్లిలోనే మరణించడంపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఇక సృజన మృతిపై వచ్చిన అనుమనాలే తాజాగా నిజామాబాద్ వైద్య విద్యార్థిని శ్వేత మృతిపై కూడా వస్తున్నాయి.
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న శ్వేత అనే యువతి చదువుల్లో బాగా రాణిస్తూ బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకుంది. ఇక రోజు లాగే గైనిక్ వార్డులో అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేసిన శ్వేత డ్యూటీ ముగించుకుని విశ్రాంతి గదిలోకి వెళ్లింది. ఏం జరిగిందో ఏం తెలియదు కానీ శ్వేత ఉన్నట్టుండి హఠాత్తుగా కిందపడిపోయింది. దీనిని గమనించిన తోటి వైద్యులు శ్వేతను లేపే ప్రయత్నం చేశారు. అయినా శ్వేత ఎంతకు లేచే ప్రయత్నం చేయలేదు. దీంతో వెంటనే అదే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించారు. కానీ అప్పటికే శ్వేత చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Bride Srujana : విశాఖ వధువు మృతిపై స్పందించిన సోదరుడు!
మరో విషయం ఏంటంటే? మరో నెల రోజుల్లోనే విద్యార్థిని శ్వేత పెళ్లి ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే శ్వేత ఉన్నట్టుండి మరణించడం వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయేమోనని కొందరు అనుమానిస్తున్నారు. శ్వేతకు గతంలో లవ్ ఎఫైర్స్ కారణంగా పెళ్లి ఇష్టం లేక సూసైడ్ చేసుకుందా? లేక మరేదైన కారణం ఉందా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇక వైద్యుల పరీక్షించిన తర్వాత కరోనా సోకడం ద్వారా వచ్చిన దుష్ఫ్రభావాల కారణంగానే శ్వేత మరణించిందని వైద్యులు చెబుతున్నారు.
అసలు శ్వేత హార్ట్ ఎటాక్ కారణంగానే మరణించిందా లేక ఆమె మరణం వెనుక ఏం జరిగిందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఘటనపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వైద్య విద్యార్థి శ్వేత మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.