మహిళ ప్రాణం తీసిన టమోట. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజమే. టమోట మనిషి ప్రాణం తీయడం ఏంటని తెగ ఆలోచిస్తున్నారా? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది మహారాష్ట్ర ముంబైలోరి మలాద్ ప్రాంతం. మార్వేలోని పాస్కల్ బారీలో రేఖా దేవి నిషాద్(35) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమె ఉంటున్న ఇంట్లో ఈ మధ్య కాలంలో ఎలుకల బెడద ఎక్కువైపోయింది.
ఏదైన చేసి ఎలుకలను ఇంట్లో ఒకటి కూడా లేకుండా చేయాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఓ టమోటను కట్ చేసి అందులో ఎలుకల మందు పెట్టి ఇంట్లో ఎలుకలు వచ్చే దారిలో పెట్టింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. కానీ అలా ఎలుకల కోసం పెట్టిన టమోటను ఆ మహిళ ఏమరపాటుగా టీవీ చూస్తూ దాంతోపాటు మరిన్ని టమోలు జత చేసి మ్యాగీ చేసుకుంది. ఇక అలా తను తయారు చేసుకున్న ఆ మ్యాగీని టీవీ చూస్తూ తింటూ ఉంది. అలా ఆ మ్యాగీ తిన్న కొంత సేపటికి ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.
దీంతో వెంటనే స్పందించిన ఆమె భర్త హుటాహుటిన ఓ ఆస్పత్రికి తరలించాడు. అలా వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన రేఖ చివరికి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా టమోటతో మహిళ ప్రాణం పోవడంతో స్థానికులు షాక్ కు గురవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.