తండ్రి అంటే బిడ్డల బాగోగులు చూసుకుంటాడు.. వారిని జీవితంలో ఉన్నత శిఖరాలపై చూడాలనుకుంటాడు. అందుకోసం ఎంతో శ్రమిస్తాడు. బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తుంటే.. వారిని మందలిస్తాడు.. సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు తండ్రిని చూస్తే.. పిల్లలు భయపడేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి. నేటి కాలం తండ్రి బిడ్డలపై బాధ్యతనే కాక.. ప్రేమను కూడా వెల్లడిస్తున్నాడు. మరి బిడ్డల బాగు కోసం అంతలా శ్రమించే తండ్రి విషయంలో ఓ కుమార్తె సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధమైన ఆరోపణలు చేసింది. కూతురుకు మంచి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించిన తండ్రికి ఆ కుమార్తె ఇచ్చిన షాక్ మామూలుది కాదు.ఏకంగా తనపై తండ్రి అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసింది. ఫలితంగా ఆ తండ్రి ఐదేళ్లు జైల్లో గడిపాడు. తాజాగా కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇక జైలు జీవితం కన్నా కూడా ఆ తండ్రిని అమితంగా బాధించిన విషయం ఏంటంటే.. కుమార్తెపై అత్యాచారం చేసిన వ్యక్తిగా సమాజం ఆ తండ్రి గురించి ఎంత నీచంగా మాట్లాడిందో తల్చుకుంటూనే గుండె తరుక్కుపోతుంది. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అంధేరిలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాధితుడి కుమార్తె.. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేయడం ప్రారంభించింది. చదువు గాలికొదిలేసి.. ప్రేమించిన వాడితో తిరగడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను హెచ్చరించాడు. చదువు మీద దృష్టి పెట్టమని సూచించాడు. కానీ ఆ బాలికకు తండ్రి మాటలు నచ్చలేదు. పెడచెవిన పెట్టి.. బాయ్ఫ్రెండ్తో తిరగడం ప్రారంభించింది. దాంతో ఆగ్రహించిన తండ్రి ఆమెను కొట్టాడు. కక్ష పెంచుకున్న బాలిక.. తండ్రి మీద సంచలన ఆరోపణలు చేసింది.
ఈ క్రమంలో బాలిక ఐదు సంవత్సరాల క్రితం అనగా 2017లో తన టీచర్లకు ఓ కట్టుకథ చెప్పింది. తండ్రి తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని.. తప్పుడు ఆరోపణలు చేసింది. అసలు విషయం తెలియని టీచర్లు.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2017లో పోలీసులు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు.
ఇక వైద్య పరిక్షలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు బాలికపై అత్యాచారం జరగలేదని తెలిసింది. ఇక బాలిక బాల్యంలోనే తన నోట్బుక్లో రాత్రి నిద్రపోతున్న సమయంలో ఎవరో తనను తాకినట్లు అనిపిస్తోందని.. పీడకలలు వస్తున్నాయని.. రాసుకుంది. వీటిని పరిశీలించిన పోలీసులు బాలిక మానసిక పరిస్థితి బాగాలేదని.. నిర్థారించుకున్నారు. ఇక తండ్రి హెచ్చరించిన కారణంగానే ఇలాంటి ఆరోపణలు చేసినట్లు గుర్తించారు. దీంతో అతడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు.. విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు, టీచర్లు.. ఎంత తప్పు జరిగిందని బాధపడుతున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.