ఈ మద్య మనుషులు కృరమృగాల కన్నా భయంకరంగా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతూ.. విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు, హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఎంతో నమ్మకంగా ఉంటూ పక్కా ప్లాన్ తో హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా దాచే ప్రయత్నం చేస్తూ ఎక్కడో ఒక పొరపాటు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాంటి హత్యలు ఎక్కువగా అక్రమసంబంధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో రోజుకో మలుపు చోటు చేసుకుంటుంది. డేటింగ్ యాప్ తో పరిచయం అయిన అమ్మాయితో మోజు తీర్చుకున్న ఓ కిరాతకుడు ఆమెను చంపి 35 ముక్కలుగా చేసి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విసిరిన ఉదంతం మరువక ముందే.. ఓ యువకుడిని ఏకంగా 80 ముక్కలు చేసి అడవిలో పాతిపెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
రేవా జిల్లా చుయియా గ్రామానికి చెందిన వికాస్ గిరి వయసు 21 ఏళ్లు.. 2021 అక్టోబర్ లో అదృశ్యమైనట్లు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఫిబ్రవరిలో అడవీ ప్రాంతంలో కొంత మంది పశువుల కాపర్లు ఒక అస్తిపంజరాన్ని చూశామని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంగటన స్థలానికి వచ్చి 80 ముక్కలుగా ఉన్న అస్తిపంజరాన్ని వెలికితీశారు. అక్కడ లభించిన ఆధార్ కార్డు లో వివరాల ప్రకారం.. మృతుడు వికాస్ గిరి గా గుర్తించారు. ఈ కేసు ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టి తొమ్మిది నెలల తర్వాత మిస్టరీ ఛేదించారు.
దర్యాప్తులో భాగంగా వికాస్ గిరికి సంబంధించిన పలు కీలక వివరాలు సేకరించారు పోలీసులు. ఈ క్రమంలో వికాస్ గిరికి యూనస్ అన్సారీ అనే వ్యక్తితో వ్యాపార భాగస్వామ్యం ఉండేదని తెలుసుకున్నారు. కేసును ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. దీంతో అన్సారీని పలుమార్లు ప్రశ్నించారు. కానీ తనకు ఏ విషయం తెలియదని.. కొంతకాలంగా అతనితో వ్యాపారలావాదేవీలు జరపడం లేదని అన్నాడు. కానీ పోలీసులకు మాత్రం అన్సారీ చెప్పే మాటలకు ఏమాత్రం పొంతన కనిపించకపోవడంతో మరికొన్ని అధారాలు సేకరించి ఈ నెల 4 న అతన్ని అరెస్ట్ చేశాడు. తమదైన కోణంలో క్రాస్ఎగ్జామ్ చేయగా.. అసలు గుట్టు బయటపెట్టాడు అన్సారీ.
స్నేహితుడని నమ్మినందుకు వికాస్ గిరి తన చెల్లెలితో అక్రమసంబంధం పెట్టుకున్నాడని.. ఒకసారి ఇద్దరినీ రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపాడు. వికాస్ గిరిపై కోపంతో కత్తితో దాడి చేయగా అతను చనిపోయాడని.. తర్వాత తన బావ సహాయంతో అతడి శరీర భాగాలను 80 ముక్కలుగా నరికి అడవీ ప్రాంతానికి వెళ్లి పూడ్చి పెట్టినట్లు తెలిపాడు. ఈ క్రమంలో అన్సారీని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనికి సహకరించిన బంధువు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అడవి నుంచి అస్తిపంజరానికి స్వాధీనం చేసుకున్న పోలీసులు దాదాపు తొమ్మిదినెలల తర్వాత మిస్టరీని చేధించారు. ఈ వార్త సోషల్ మీడియాలో పెను సంచలనం రేపింది.