ప్రేమను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి చూపించిన కపట ప్రేమకు మోసపోయానని ఓ యువతి కన్నీరు పెట్టుకుంటోంది. ప్రేమించే వరకు వెంటపడి ఆ వ్యక్తి.. తీరా నమ్మిన తర్వాత ఆరేళ్లుగా ఆమెతో కలిసి తిరిగాడు. తాజాగా ప్రేమించిన యువతిని కాదని వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు బాగా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. యువతులను తమ వలలో వేసుకుంటున్నారు. అలా ప్రేమ పేరుతో తమ వెంట తిప్పుకొని.. కోరికలు తీర్చుకున్న తరువాత ముఖం చాటేస్తున్నారు. అయితే లవర్ మోసం చేయడం జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆరేళ్లుగా ప్రేమించిన యువతిని కాదని మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అయితే తనను ప్రేమించి మరొక యువతితో పెళ్లికి రెడీ కావడం ప్రియురాలు జీర్ణించుకోలేక పోయింది. ప్రేమ పేరుతో మోసపోయిన తనకు న్యాయం జరగాలంటూ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వినూత్నేశ్వరి పటేళ్ గూడలోని ఎల్లంకి కాలేజీ బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ చదివే సమయంలో అమీన్ పూర్ మండల ఎంపీపీ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ప్రశాంత్ తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరకు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలా వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అలా చాలా కాలం పాటు ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం లవ్ ట్రాక్ నడిపిన ప్రశాంత్ సడెన్ గా వేరే యువతితో శుక్రవారం నిశ్చితార్థం చేసుకున్నాడు.
అయితే బాధితురాలితో ప్రశాంత్ నడిపిన ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి కుటుంబ సభ్యులు యువతి ఇంటికి వచ్చారు. ఎంపీపీ దేవానంద్, ఆయన కుటుంబ సభ్యులు వెళ్లి.. తన కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగడంతో యువతి మనస్తాపానికి గురైంది. తనను ప్రేమించిన వ్యక్తి.. మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడాన్ని యువతి తట్టుకోలేక విష పదార్ధం తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని పటాన్ చెరువులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక మీడియాతో మాట్లాడిని బాధితురాలు.. తనకు ప్రియుడు ప్రశాంత్ తో వివాహం జరిపించాలని కోరుతోంది.
మరి.. ప్రేమపేరుతో మోసం చేసి..ముఖం చాటేసిన ప్రియుడు.. తన తండ్రి రాజకీయ పలుకుబడితో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటాడా? లేదా యువతిని పెళ్లి చేసుకుని న్యాయం చేస్తాడో చూడాలి. ప్రేమ పేరుతో మోసపోయి ఇలా ఎంతో మంది యువతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి స్థానికులు కోరుతున్నారు. మరి.. ఆరేళ్లుగా ఒక యువతిని ప్రేమించి.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన ఈ యువకుడి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.