మృత్యువు మనిషికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పడం కష్టం అంటారు. అప్పటి వరకు మన మద్యనే ఉన్నవారు అకస్మాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోతుంటాయి.
మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఇతరులను కాపాడబోయి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో జరిగింది. మూసీలో నదిలో మునిగిపోతున్న ఓ గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్ ప్రాంతంలోని మూసీ నదిలో గుర్రాన్ని రంక్షించేందుకు ప్రయత్నించి ఇద్దరు యువకుడు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చనిపోయిన యువకులు మహ్మద్ సైఫ్, అషు సింగ్ గా పోలీసులు గుర్తించారు. కిషన్ బాగ్ చిరాక్ లైన్ ప్రాంతంలో అక్రం అనే వ్యక్తి కిస్మత్ పూర్ లో హార్స్ రైడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అక్రం తనయుడు మహ్మద్ సైఫ్.. వయసు 18 సంవత్సరాలు. హార్స్ రైడింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇచ్చేవాడు. వీరి వద్ద ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఆషు సింగ్.. వయసు 19 సంవత్సరాలు.. హార్స్ రైడర్ గా పనిచేస్తున్నాడు.
ఆషూ సింగ్ హార్స్ రైడ్ చేస్తూ అనుకోకుండా ఈసీ కాలువలో గుర్రంతో సహ పడిపోయాడు. అది గమనించిన సైఫ్ నీటిలోకి దిగి గుర్రాన్ని, ఆషూ సింగ్ ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్థానికులను ఎవరినైనా పిలిచే ప్రయత్నం చేద్దామంలే చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. దాంతో ఒక్కడే ఆషు, గుర్రాన్ని లాగలేకపోయాడు. దీంతో సైఫ్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఇలా గుర్రంతో సహా ఇద్దరు ప్రాణాలు వదిలారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు. మృత దేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.