Prathipadu: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడకు చెందిన చైతన్య, పవన్, విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి, విశాఖకు చెందిన సౌమ్యికలు సోమవారం ఓ కారులో విజయవాడ నుంచి చిలకలూరి పేటకు బయలు దేరారు. కారు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పరిధిలోని తుమ్మలపాలెం వద్ద ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులందరూ ఆర్కిటెక్చర్ విద్యార్థులయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : స్వాతంత్య్రం గురించి స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో వ్యాపారి మృతి!