స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ వ్యాపార వేత్త స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించాడు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలో ఆ వ్యాపారి స్థానికులతో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో అక్కడ వేదికపైన ఉన్నవారంత స్వాతంత్ర్యంకు సంబంధించిన అనేక ముఖ్య ఘట్టాలను తెలిపారు. వ్యాపారి కూడా స్వాతంత్య్రంకు ముందు నాటి విశేషాలను తెలియజేస్తున్నాడు. అక్కడి కాలనీ వాసులు కూడా ఆసక్తిగా వింటున్నారు. ఈక్రమంలో ఆ వ్యాపారవేత్తకు అకస్మాత్తు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాయి.. ప్రాణాలు వదిలాడు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు కృష్ణయ్య దారుణ హత్య! ఇదీ చదవండి: కూలీపనులకు వెళ్తుండగా తాటి చెట్టు రూపంలో వెంటాడిన మృత్యువు!