డబ్బు కోసం ఈ మద్య మనుషులు ఎన్ని దారుణాలకైనా పాల్పపడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదనకోసం ఎదుటి వారిని నమ్మించి డబ్బు, బంగారం దోచుకుంటున్నారు.
ప్రస్తుతం రోజుల్లో డబ్బు కోసం ఎన్ని దారుణాలకైనా తెగబడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి సర్వస్వం దోచుకుంటున్నారు. ఈ మద్య కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. కష్టపడకుండా మోసాలు చేస్తూ డబ్బు సంపాదించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బు, బంగారం దోచుకుంటున్నారు. వృద్ద మహిళలను ఓ కేటుగాడు డాక్టర్ అని నమ్మించి దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోయి వెళితే..
సాధారణంగా బస్సు, ట్రైన్, విమాన ప్రయాణాలు చేసే సమయంలో కొంతమంది అపరిచితులతో పరిచయాలు ఏర్పడతాయి. అలా పరిచయం చేసుకొని ఓ మహిళను కేటుగాడు దారుణంగా మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలో నకిలీ డాక్టర్ చేతివాటం ప్రదర్శించాడు. సుజాత అనే మహిళను ట్రైన్ జర్నీలో ఓ యువకుడి పరిచయం చేసుకున్నాడు. అలా పరిచయం కాస్తా, కబుర్లు వరకు వెళ్లింది. తాను నీమ్స్ హిస్పిటల్ లో సర్జన్ గా పనిచేస్తున్నానని.. ఎంతోమందికి వైద్య చేసి నయం చేసినట్లు తెలిపారు. అతని వాలకం చూసి ఆమె గుడ్డిగా నమ్మింది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నూకల సుజాత అనే మహిళ గత కొంత కాలంగా హైదరాబాదులో కేబీహెచ్బి ప్రాంతంలో టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది తెలుస్తుంది. ఇటీవల ఓ ఫంక్షన్ కోసం విజయవాడకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో సదరు వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి డాక్టర్ అని నమ్మి తనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీచెప్పింది. తనకు పెద్దవాళ్లంటే గౌరవం అని.. నకిలీ డాక్టర్ ఆ మహిళకు ఫీజు లేకుండా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తానని, తాను ఓ అడ్రస్ చెబుతా అక్కడికి రావాలని సూచించాడు.
ఈ క్రమంలో నకిలీ వైద్యుడిని కలిసేందుకు గురుద్వారా వద్ద ఉన్న సాయి వినాయక లాడ్జిలో కలిసేందుక వెళ్లింది. లాడ్జ్ సిబ్బందికి తన అత్తమ్మ అని, ట్రీట్ మెంట్ కోసం వచ్చిందని చెప్పి రూమ్ కి తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత మహిళకు మత్తు ఇచ్చి 30 వేల విలువైన బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్ను దొంగిలించి పారిపోయాడు. సదరు మహిళ లాడ్జి సిబ్బందితో తనకు జరిగిన మోసం గురించి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా నకిలీ డాక్టర్ ను గాలిస్తున్నారు.