నవ మాసాలు మోసిన తల్లి తన బిడ్డలు ప్రయోజకులు అయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి తల్లి ప్రేమను వర్ణించడానికి వర్ణనకు కూడా అందదు. కానీ ఓ తల్లి తన కుమారుడికి చూడకూడని స్థితిలో కనిపించింది. దీనిని అవమానంగా భావించిన ఆ కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలు. ఇదే గ్రామానికి చెందిన వెంకట్ అనే యువకుడి తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే తల్లి వక్రమార్గంలోకి అడుగులు వేసింది. ఏకంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం కొడుకు వెంకట్ కు తెలియడంతో ఇలా చేయొద్దంటూ అనేక సార్లు చెప్పి చూశాడు.
అయినా తల్లి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇదిలా ఉంటే వెంకట్ ఇటీవల ఓ రోజు పని మీద బయటకు వెళ్లాడు. సాయంత్ర వెంకట్ ఇంట్లోకి ఇంట్రీ ఇవ్వగానే తల్లి ప్రియుడితో ఏకాంతంగా కనిపించింది. తల్లిని చూడకూడని స్థితిలో చూసి కొడుకు తట్టుకోలేకపోయాడు. దీనిని అవమానంగా భావించిన వెంకట్ తల్లి చేసిన దారుణాన్ని తలుచుకుంటూ కుమిలిపోతుండేవాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి కలిగిన వెంకట్ తల్లి చీరతోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తల్లిని చూడకూడని స్థితిలో చూసి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.