శివానీ భర్తకు తనను చంపేస్తారని ముందే తెలిసిందా? తెలియకపోతే వీడియోలో చావు కల కొట్టొచ్చినట్టు ఎందుకు కనబడుతుంది. వీడియోలో కానిస్టేబుల్ రమేష్ మాటలు గమనించారా?
విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో సినిమాని తలపించే ట్విస్ట్ లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కట్టుకున్న భార్యే ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. శివాని అలియాస్ శివజ్యోతి తెలివితేటలకు పోలీసులు సైతం షాక్ అయ్యారు. భర్తను చంపడానికి స్కెచ్ వేసింది శివజ్యోతినే అని పోలీసుల విచారణలో తేలింది. అసలు భర్తను చంపుతున్నట్టు అనుమానం రాకుండా చాలా బాగా మ్యానేజ్ చేసింది. అందుకోసం భర్తతో కలిసి రీల్స్ చేసేది. వారిది ఎంత గొప్ప బంధమో అని సమాజానికి సందేశాన్ని పాస్ చేసింది. ఆ వీడియోలు చుస్తే నిజంగా వీరిది పవిత్ర బంధమేమో.. భర్త అంటే శివజ్యోతికి అమితమైన ప్రేమ ఏమో అన్న భావన కలుగుతుంది. కానీ రీల్ లో కనిపించే దానికి, రియల్ గా కనిపించే దానికి చాలా తేడా ఉంది.
అనుమానం రాకుండా స్కెచ్ వేసి చంపేసి గుండెపోటుతో మరణించాడు అన్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్టు సమాజం గట్టిగా ఫిక్స్ అయ్యేలా వీడియోలు చేసి.. ఫైనల్ మిషన్ కి వెళ్ళిపోయింది. ఆరోజు రాత్రి భర్తకు మటన్ వండి పెట్టి.. మందు పోసి కూల్ గా చంపేసింది. దీని కంటే ముందు భర్తతో.. తన భార్య చాలా మంచిది అని చెప్పించింది. దీంతో ఎవరికీ అనుమానం రాదని శివజ్యోతి భావించింది. పీకలదాకా తాగి మత్తులో తూలుతున్న భర్తను మంచం మీద పడుకోబెట్టే వరకూ వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాత కెమెరా సెల్ పక్కనెట్టి రమేష్ ని నిద్రపోయాక తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. గుండెపోటుతో మరణించినట్టు అందరినీ నమ్మించింది.
అయితే పోలీసులకు శివజ్యోతి ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగానే కేసును నమోదు చేశారు. మొదటగా శివజ్యోతిని విచారణ చేపట్టారు పోలీసులు. ఆ సమయంలో తాము అన్యోన్యంగా ఉంటున్నామంటూ అంతకు ముందు చేసిన రీల్స్ చూపించింది. అయినా గానీ పోలీసులు నమ్మలేదు. శివజ్యోతి మీద మరింత అనుమానం పెరిగింది. దీనికి తోడు పోస్టుమార్టం రిపోర్టులో రమేష్ ఊపిరాడక మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో శివజ్యోతి అసలు నిజం బయటపెట్టింది. రమేష్ చనిపోయాక అనుమానం రాకుండా ఉండడం కోసం ముందుగానే వీడియోలు రికార్డ్ చేసినట్లు శివజ్యోతి వెల్లడించింది.
మటన్ వండి, మందు పోసి భర్తను మట్టుబెట్టింది. అయితే చనిపోయేముందు రికార్డ్ చేసిన వీడియోలో రమేష్ తన భార్య గురించి గొప్పగా చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్య చాలా మంచిదని.. గొప్పదని అన్నాడు. మరి తనకు చావు వస్తుందని తెలిసిందో లేక జీవితం మీద విరక్తి కలిగిందో తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు వింటే మాత్రం అతనికి బతకడం ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తుంది. నేను ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ ధైర్యంగా ఉండాలి.. దేవుడు కరుణిస్తే వందేళ్లు నీతో కలిసి జీవిస్తాను, లేదంటే మధ్యలోనే పుటుక్కుమంటాను అని రమేష్ చెప్పడం వెనుక సందేహాలు వస్తున్నాయి. మరి మీకు కూడా వీడియోలో రమేష్ మాట్లాడిన మాటలకు సందేహం వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.