అత్త, మామలంటే అటు కోడలికి, ఇటు అల్లుడికి పడటం లేదు. దీంతో చిన్న విషయాల దగ్గరే కోడల్ని అత్తమామలు మందలించడం, మర్యాదలు లేదా కోరిన కోర్కెలు తీర్చడం లేదని అత్తారింటిపై అల్లుడు అలిగి భార్యను తన పుట్టింటికి పంపించకపోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది.
నేడు బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లితో ఒక్కటవుతున్న రెండు కుటుంబాల మధ్య కార్చిచ్చు రేగుతోంది. అత్త, మామలంటే అటు కోడలికి, ఇటు అల్లుడికి పడటం లేదు. దీంతో చిన్న విషయాల దగ్గరే కోడల్ని అత్తమామలు మందలించడం, మర్యాదలు లేదా కోరిన కోర్కెలు తీర్చడం లేదని అత్తారింటిపై అల్లుడు అలిగి.. భార్యను తన పుట్టింటికి పంపించకపోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. కానీ ఆ చిన్న గొడవలే.. పెద్దగా మారి తీవ్రతకు దారి తీస్తున్నాయి. ఇటీవల కూతుర్ని ఇచ్చిన అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఇప్పుడు కోడలిని మామ హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో కోడల్ని మామ ఘోరంగా చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని మల్లికాపురంలో రఘువీర్ సింగ్ కుటుంబం నివసిస్తుంది. ఇతడికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు గౌరవ్ సింగ్ ఇటీవల మరణించాడు. అతడి భార్య ప్రియాంక పుట్టింటికి వెళ్లి..వస్తూ ఉండేది. అయితే తోడికోడళ్లకు అస్తమాను గొడవలు అయ్యేవి. మామ ఇద్దరినీ వారించారు. కోడలు ప్రియాంక ఇంటికి వచ్చిన ప్రతిసారి తోటి కోడలితో గొడవ పడుతుండటాన్ని గమనించాడు మామ రఘువీర్. అలాగే సోమవారం కూడా తోటి కోడళ్ల మధ్య పెద్ద తగాదా జరిగింది. పెద్ద కోడల్ని..చిన్న కోడలు ప్రియాంక నెట్టేయడంతో ఆమె నేలపై పడింది.
ఇదంతా చూస్తున్న మామ.. కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ప్రియాంకపై దాడి చేసి హత్య చేశాడు. అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కాగా, అతడి పెద్ద కుమారుడు పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు లేడు. బాధితురాలు ప్రియాంక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘువీర్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రియాంక చనిపోయిన భర్త గౌరవ్ సింగ్ పేరు కూడా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని కిర్వాలీ పోలీస్ స్టేషన్ చీఫ్ ఉపేంద్ర కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.