అక్క భర్త లేదా మేనమామ కొడుకైన బావకు.. బావమరిది కన్నా మరదలి దగ్గరే స్వాతంత్య్రం ఎక్కువ ఉంటుంది. అందుకే వారి మధ్య జరిగే చిన్ని చిన్న గిల్జికజ్జాలను సరదాగా తీసుకుంటారు. ఏదైనా పొట్లాట వచ్చినా సరిపోయిందీ మీ బావ, మరదళ్ల సరసాలు అంటూ పెద్దలు దెప్పుతుంటారు. కానీ ఇవి కొన్ని సార్లు శృతిమించుతున్నాయి.
బావ, మరదల్లు అనగానే చిలిపి పనులు, ఆట పట్టించడం, సరసాలు కామన్. అవి మితి మీరనంత వరకే. అక్క భర్త లేదా మేనమామ కొడుకైన బావకు.. బావమరిది కన్నా మరదలి దగ్గరే స్వాతంత్య్రం ఎక్కువ ఉంటుంది. అందుకే వారి మధ్య జరిగే చిన్ని చిన్న గిల్జికజ్జాలను సరదాగా తీసుకుంటారు. ఏదైనా పొట్లాట వచ్చినా సరిపోయిందీ మీ బావ, మరదళ్ల సరసాలు అంటూ పెద్దలు దెప్పుతుంటారు. కానీ ఇవి కొన్ని సార్లు శృతిమించుతున్నాయి. అక్క మెడలో తాళి కట్టిన వ్యక్తి.. మరదలితో సంబంధాలు పెట్టుకుని, సరససల్లాపాల్లో మునిగి తేలుతున్నాడు. దీని వల్ల కుటుంబ కలహాలు మొదలై.. తీవ్రతకు దారి తీస్తున్నాయి. ఇటువంటిదే తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
అక్కను మనువాడిన బావ.. మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరదలికి మరొకరితో పెళ్లి కుదరడం జీర్ణించుకోలేకపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన పెదపూడి సత్యనారాయణ (33) చిన్నతనం నుంచీ తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం పోతినీడుపాలెంలోని మేనమామ దగ్గర పెరిగాడు. మేనమామకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెతో అతడికి వివాహం అయ్యింది. అయితే సత్యనారాయణకు సాయి శ్రీనివాస అనే బ్యాండ్ ట్రూప్ ఉంది. అందులో మరదలు పాటలు పాడేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే మరదలికి ఇటీవల మరొకరితో వివాహం కుదిరింది. ఈ విషయాన్ని బావ సత్యనారాయణ జీర్ణించుకోలేకపోయాడు. తరచూ వరుడితో మాట్లాడుతుండటంతో కోపంతో రగిలిపోయాడు.
తనకు ఆమె దూరమవుతోందని భావించిన బావ.. ఆమెను అంతం చేయాలనుకున్నాడు. పాటలు పాడుతున్నమరదలిని.. మాట్లాడాలని బయటకు పిలిచిన బావ ఆమెను గ్రామంలోని కానూరి సత్యనారాయణ పామాయిల్ తోటకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకువెళ్లాడు. ఆమె కత్తితో గొంతుపై కోశాడు. ఆమె చనిపోయిందని భావించి.. కోండ్రుపాడు రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెతకగా.. రైల్వే ట్రాకు వద్ద అతడి మృతదేహం కనిపించింది. అనంతరం యువతి కోసం గాలించగా.. ఆమె పామాయిల్ తోటల్లో రక్తపు మడుగుల్లో పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.